logo

చెరువులోకి దిగి.. గల్లంతై..

స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ యువకుడు చెరువులో మునిగి గల్లంతైన ఘటన వెల్దుర్తి ఠాణా పరిధి మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన

Published : 15 Jan 2022 00:52 IST

గాలిస్తున్న మత్స్యకారులు

మాసాయిపేట (వెల్దుర్తి), న్యూస్‌టుడే: స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ యువకుడు చెరువులో మునిగి గల్లంతైన ఘటన వెల్దుర్తి ఠాణా పరిధి మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాలు.. మాసాయిపేటకు చెందిన బొబ్బిల్ల సురేష్‌ ఇళ్లకు రంగులు వేసే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన తోటి కార్మికులు గుండారం రమేష్‌, నర్సింలుతో కలిపి అచ్చంపేటకు  వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో అచ్చంపేట ఊర చెరువులో స్నానం చేయడానికి దిగాడు. ఈ క్రమంలో సురేష్‌ నీట మునిగిపోయాడు. మిగతా వారు ఎంత యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సురేష్‌ కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మత్య్సకారుల సాయంతో గాలించారు. చీకటి పడటంతో గాలింపును నిలివేశారు. శనివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని ఎస్‌ఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని