logo

ఇంట్లోకి చొరబడి పుస్తెల తాడు చోరీ

ఇంట్లోకి చొరబడి మహిళ ప్రతిఘటించినా మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని ఎత్తుకెళ్లిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంటలో జరిగింది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు..

Published : 15 Jan 2022 00:52 IST

చేగుంట, న్యూస్‌టుడే: ఇంట్లోకి చొరబడి మహిళ ప్రతిఘటించినా మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని ఎత్తుకెళ్లిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంటలో జరిగింది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. రైల్వేస్టేషన్‌ రోడ్డులో పద్మ తన ఎదురింట్లో జరుగుతున్న వ్రతానికి వెళ్లారు. గురువారం రాత్రి పదకొండు గంటలకు తిరిగి ఇంట్లోకి రాగానే వెనుకనుంచి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని బంగారు పుస్తులతాడు లాక్కునేందుకు యత్నించాడు. ఆమె పెనుగులాడటంతో దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తెరతో కత్తిరించుకొని పరారయ్యాడు. మూడు తులాల తాడులో కేవలం ఒక తులం చేతిలో మిగిలిపోయింది. విషయం తెలిసిన రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌ శుక్రవారం వచ్చి వివరాలు తెలుసుకున్నారు. చేగుంట, రామాయంపేట, నిజాంపేట ఎస్‌ఐలు సుభాష్‌గౌడ్‌, రాజేష్‌, ప్రకాష్‌గౌడ్‌ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. భర్త లక్ష్మినర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన సమయంలో విద్యుత్తు లేకపోవడంతో వీధిలోని సీసీ కెమెరాల దృశ్యాలు అందుబాటులో లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని