logo

కుమార్తెకిచ్చిన భూమి తనకు చెందలేదని తండ్రి ఆత్మహత్య

మనవరాలికి తాత ఇచ్చిన భూమి తనకు దక్కలేదనే ఆవేదనతో ఆ చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మద్దూరు మండలం నర్సాయపల్లిలో జరిగింది. ఇన్‌ఛార్జి ఎస్సై భాస్కర్‌రెడ్డి

Published : 15 Jan 2022 00:52 IST

మద్దూరు, న్యూస్‌టుడే: మనవరాలికి తాత ఇచ్చిన భూమి తనకు దక్కలేదనే ఆవేదనతో ఆ చిన్నారి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మద్దూరు మండలం నర్సాయపల్లిలో జరిగింది. ఇన్‌ఛార్జి ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. నర్సాయపల్లికి చెందిన తొడెంగల కిష్టయ్యకు కొడుకులు ఇద్దరు. తనకున్న ఐదెకరాల్లో పెద్దోడికి రెండెకరాలు రాసిచ్చారు. చిన్నోడు కనక శ్రీను (32) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. కనకశ్రీను కుమార్తె నాలుగేళ్ల సాయిసుధకు తల్లి శైలజ గార్డియన్‌గా రెండెకరాలను ఐదేళ్ల క్రితం తాత రాసిచ్చారు. అప్పటినుంచి కిష్టయ్యను కనకశ్రీను తనకు భూమి రాసివ్వాలంటూ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత సాయిసుధకు ఇచ్చిన దాంట్లో ఎకరం ఇస్తానని తండ్రి చెప్పినా వినకుండా క్షణికావేశంలో గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకున్నాడు. కనకశ్రీనుకు ఒకరే కుమార్తె. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని