అందుబాటులో అవకాశం.. దృష్టి సారిస్తే ఆదాయం
వ్యాపార రంగంలో పరిగి పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. మేజర్ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారిన అనంతరం పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ప్రధానంగా గృహ నిర్మాణాలు ముమ్మరమయ్యాయి. నియోజకవర్గ
ప్రహరీ వద్ద డబ్బాలు తొలగించిన అనంతరం ఇలా..
పరిగి,న్యూస్టుడే: వ్యాపార రంగంలో పరిగి పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. మేజర్ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారిన అనంతరం పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ప్రధానంగా గృహ నిర్మాణాలు ముమ్మరమయ్యాయి. నియోజకవర్గ కేంద్రం కావడం, స్థానికంగా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు ఉండటంతో స్థానికంగా ఉండేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఆసక్తి చూపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 18,241 ఉంటే ప్రస్తుతం రెట్టింపు స్థాయికి చేరింది. కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. చిరు వ్యాపారాలు చేస్తూ వేలాది మంది జీవనం కొనసాగిస్తున్నారు. స్టీలు కర్మాగారాలు, పత్తి మిల్లులు, ట్రాక్టరు షోరూంలు ఇలా వివిధ రంగాల్లోనూ ముందడుగు పడుతోంది. దీంతో నిత్యం పట్టణం ప్రజల రాకపోకలతో రద్దీగా మారింది. నగరంలోని కాటేదాన్ నుంచి రాకంచర్లకు పరిశ్రమలు క్రమక్రమంగా తరలిరానున్నాయి. దీంతో వాటి ప్రభావం కూడా పడనుంది. ఇప్పటికే పట్టణంలో దుకాణ సముదాయాలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన రహదారులపై ఉన్న వాటికి అయితే రూ.2నుంచి రూ.5లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించి నెల అద్దె రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఇస్తున్నారు.
ఇదిగో ఇలా..: ఆర్టీసీకి డిపోకు 7.16 ఎకరాలు, బస్టాండుకు 3.09ఎకరాలు కలిపి మొత్తంగా 10.25ఎకరాల విస్తీర్ణంలో స్థలం ఉంది. పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ అధికారులు గంజ్రోడ్డులో ఆర్టీసీ బస్టాండు ప్రహరీకి ఆనుకుని ఉన్న డబ్బాలను తొలగించి సింగిల్ రోడ్డును విస్తరిస్తున్నారు. పట్టణంలో వ్యాపార పరంగా ఇదే ప్రధాన రహదారి. డబ్బాలను తొలగిస్తే తమకు ఉపాధి లేకుండా పోతోందని కనీసం దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని గత కొంత కాలంగా చిరు వ్యాపారులు కోరుతున్నారు. కనీసం 40దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అనువైన వసతి ఉంది. నెలకు లక్షలాది రూపాయల ఆదాయం సంస్థకు సమకూరనుంది. నష్టాల్లో ఉన్న సంస్థ అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశుభ్రత, పచ్చదనం కూడా కొరవడింది. డిపో అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతున్నారు.
ఇలా చేస్తే...: పరిగి డిపోలో సంస్థకు చెందినవి 44, అద్దె బస్సులు 39 ఉన్నాయి. ఇవి నిత్యం సుమారు 30వేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా కారణంగా గతేడాది నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.10కోట్ల నష్టాల్లో కొనసాగుతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా సంస్థకు నష్టాలే మిగులుతున్నాయి. బస్టాండు నుంచి డిపోకు, డిపో నుంచి బస్టాండుకు బస్సుల రావాలంటే రోడ్డెక్కుతున్నాయి. మధ్య దూరం సుమారు రానుపోను 300మీటర్ల దూరం ఉంది. దీంతో డీజిల్ వృథాగా కాలుతోంది. బస్టాండుకు, డిపోకు మధ్య ఉన్న ప్రహరీని బస్సుల రాకపోకలకు అనువుగా ఉండేంత వరకు తొలగిస్తే చాలు వేల లీటర్ల డీజిల్ను ఆదా చేసుకునేందుకు అవకాశముంది. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు మరో మార్గమని పలువురు సూచిస్తున్నారు. డిపో మేనేజర్ కార్యాలయం ముందు కూడా దుకాణ సముదాయానికి అవకాశముంది.
ఉన్నతాధికారులకు విన్నవిస్తాం: బద్రీనారాయణ, డిపో మేనేజర్
స్థానికంగా దుకాణ సముదాయాలకు ఉన్న డిమాండ్ను, అవకాశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. బస్డిపో నుంచి బస్టాండులోకి బస్సుల రాకపోకలకు ప్రహరీ తొలగించాలని గతంలో ఓసారి పరిశీలించారు. దీనిని కూడా వివరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా