మార్గనిర్దేశం సరే.. అమలెప్పుడో మరి!
పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పంచాయతీల్లోనే ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేశారు. నెలలు గడిచినా అమలుకు నోచుకోవడం
ముద్రిత పత్రాల జారీలో ఇదీతీరు
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
కరణ్కోట పంచాయతీ కార్యాలయంలో విగణిత
పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పంచాయతీల్లోనే ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేశారు. నెలలు గడిచినా అమలుకు నోచుకోవడం లేదు. వెరసి వందలాది మంది గ్రామీణులు పట్టణాలు, మండల కేంద్రాల్లోని మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభిస్తే సౌకర్యంగా మారనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ‘న్యూస్టుడే’ పరిశీలనాత్మక కథనం.
జిల్లాలో పంచాయతీలు: 566
విగణితలున్నవి: 225
ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేస్తున్నవి: 20లోపు మాత్రమే
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు మినహా మిగిలినవి గ్రామాలే. డెబ్భై శాతంపైగా కుటుంబాలు ఇక్కడే నివాసముంటున్నాయి. ఈ క్రమంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు పొందేందుకు, రాయితీల మంజూరుకు, ఉన్నత, గురుకుల విద్యా ప్రవేశ పరీక్షలకు జనన, నివాస, కుల, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఏటా ధ్రువపత్రాలు పొందాల్సిన పరిస్థితి. వీటిని సులువుగా పొందేందుకు ప్రభుత్వం చేతిరాతతో పని లేకుండా నేరుగా ఆన్లైన్లో ముద్రిత పత్రాలు పొందేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసి నిర్ణీత గడువులోగా తిరిగి అక్కడే ధ్రువపత్రాన్ని పొందే వెసులుబాటు కల్పించింది. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 60 మీసేవా కేంద్రాలు మాత్రమే ఉండటంతో గ్రామీణులు మండల కేంద్రాలు, పట్టణాలకు వచ్చి పత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రవాణా ఛార్జీలు భరించి రావడంతో ఆర్థిక భారంతోపాటు సమయం వృథా అవుతోంది.
పౌరులకు సౌకర్యంగా ఉండేందుకు..
పౌరులు ఇబ్బందులు పడకుండా స్థానికంగా పత్రాలు పొందేలా పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేసింది. ఈక్రమంలో ముద్రిత జనన ధ్రువ పత్రాలను గ్రామ పంచాయతీల్లో జారీ చేయాలని ఆదేశించింది. గతంలో పంచాయతీలకు సమకూర్చిన విగణిత, ప్రింటర్, స్కానర్, బ్యాటరీ వంటి సామగ్రి ద్వారా ఇవ్వాలని సూచించింది. ఈమేరకు డీఎల్పీఓ చంద్రశేఖర్రావు తాండూరు నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నెలలు గడిచినా ఈ ప్రక్రియ మొదలవడం లేదు. కొందరు ఇస్తున్నా, చేతి రాతతో స్టాంపు వేసి ఇస్తున్నారు. దీంతో పారదర్శకతకు వీల్లేకుండాపోతోంది. దీనికితోడు వీటిని నవోదయ, సైనిక్ స్కూల్ వంటి ప్రవేశ పరీక్షల దరఖాస్తు సమయంలో నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకం దరఖాస్తులోనూ చేతిరాతలతో జారీ చేసిన జనన ధ్రువపత్రాలను బ్యాంకర్లు అంగీకరించడం లేదు. దీంతో తల్లిదండ్రులు ముద్రిత జనన ధ్రువపత్రాలు పొందేందుకు మీసేవ కేంద్రాలు, తహసీల్, ఆర్డీఓ కార్యాలయాలకు చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. పంచాయతీల్లోనే ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేస్తే లక్షల మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరనుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇలా చేస్తే మేలు..
* పంచాయతీలకు గతంలో సరఫరా చేసిన విగణితలు, సామగ్రిని అందుబాటులోకి తీసుకురావాలి.
* కార్యదర్శుల ద్వారా ముద్రిత ధ్రువపత్రాల జారీ తప్పనిసరి చేయాలి.
* కొత్త పంచాయతీలకు సామగ్రిని సమకూర్చాలి.
* పంచాయతీలకు సమకూర్చిన అంతర్జాల కనెక్షన్ ప్రజావసరాలకు వినియోగించాలి.
* ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
* నామమాత్రపు రుసుం విధిస్తే ఆదాయం సమకూరడంతో నిర్వహణ భారం తప్పనుంది.
* గ్రామస్థులకు సమయం, రవాణా ఛార్జీలు ఆదా అయ్యేందుకు తోడ్పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పాలనతోనే గ్రామాల్లో మార్పు: కొండా
[ 29-03-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్, కడ్మూరు, మేడిపల్లి కలాన్ గ్రామాల్లో పర్యటించారు. -
మహమ్మారిపై అప్రమత్తత అవసరం
[ 29-03-2024]
ప్రమాదకర ఎయిడ్స్పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్లైన్ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. -
ఇసుక అక్రమ నిల్వ.. అదనుచూసి విక్రయం
[ 29-03-2024]
తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 29-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్