logo

రాజీవ్‌నగర్‌ చోరీ ఘటనలో పురోగతి

రాజీవ్‌నగర్‌లోని శ్రీ సాయినివాస్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ చోరీ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడిన దొంగలు సుమారు 2 కిలోల

Published : 15 Jan 2022 01:43 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రాజీవ్‌నగర్‌లోని శ్రీ సాయినివాస్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ చోరీ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడిన దొంగలు సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, రూ.25లక్షల నగదు చోరీ చేసిన విషయం తెలిసిందే.  ఆ కుటుంబం స్వగ్రామానికి వెళ్లగా బుధవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. భారీగా నగలు, నగదు మాయం కావడంతో ఎస్సార్‌నగర్‌ పోలీసులతోపాటు రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్లు పశ్చిమ మండలం పోలీసులు గుర్తించారు.  అతని సోదరుడిని ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని