లక్ష్యానికి ప్రాణం.. జీవాలకు జీవం
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి మనుషులు గాయపడితే వెంటనే అంబులెన్స్ వస్తుంది. సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర సేవలు అందిస్తారు. అదే మూగజీవాలను ఎవరూ పట్టించుని చికిత్స అందించరు. ఇదే ఓ యువతిని
గాయపడ్డ పక్షులు, వీధి కుక్కల సంరక్షణ
ఆదర్శంగా నిలుస్తున్న యువ వైద్యురాలు
ఈటీవీ, హైదరాబాద్: ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి మనుషులు గాయపడితే వెంటనే అంబులెన్స్ వస్తుంది. సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర సేవలు అందిస్తారు. అదే మూగజీవాలను ఎవరూ పట్టించుని చికిత్స అందించరు. ఇదే ఓ యువతిని ఆలోచింపజేసింది. మూగజీవాల కోసం ఏదైనా చేయాలన్న ఆమె తలంపు వందలాది శునకాలు, పక్షులు, పిల్లులు, కోతులకు కొత్త జీవితాన్నిచ్చింది.
వేతనంలో నుంచి వెచ్చిస్తూ..
కొత్తపేట చెరుకుతోట కాలనీకి చెందిన డా.సింధూర పోతినేని 2018లో బీడీఎస్ పూర్తి చేసింది. అమీర్పేట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తోంది. పీజీ కోసం సిద్ధమవుతున్న ఆమె రోడ్డు, ఇతరత్రా ప్రమాదాల్లో గాయపడిన శునకాలు, పతంగులు ఎగురవేసే క్రమంలో మాంజాకు చిక్కుకుని గాయపడి, విద్యుదాఘాతానికి గురైన పక్షులు విలవిల్లాడి చనిపోకుండా చేరదీసి చికిత్స అందించి ప్రాణం పోస్తోంది. తనకు తెలిసిన ఓ ఆర్నిథాలజిస్ట్ సూచనలు స్వీకరించి పక్షులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆమె 120 పైగా పక్షులను కాపాడి స్వేచ్ఛగా వదిలేసింది. మరో 36 రకాల జాతులకు జీవం పోసింది. తండ్రి రాజేంద్రబాబు, తల్లి వనజ ప్రోత్సాహంతోపాటు తనకు వచ్చే వేతనంలో కొంత వెచ్చిస్తూ వాటిని సంరక్షిస్తోంది. ఇప్పటి వరకు 350 పైగా శునకాల్ని కాపాడింది. వీటిలో 150 పైగా తీసుకొచ్చిన కాలనీల్లో వదిలేసింది. 250 పైగా శునకాలకు టీకా వేయించింది. పునరావాసం కల్పించి సంరక్షిస్తున్న శునకాలకు లైలా, బ్రౌనీ, బఠానీ అని పేర్లు పెట్టి ముద్దుగా పిలుస్తుంటే అవి చేసే గారాబం, అల్లరి అంతా ఇంతా కాదు. వీధి కుక్కలే కాకుండా కోతులు, పిల్లులు, కోతులు, బల్లులు, తొండలు, ఉడతలు, పక్షులు, ఇతర మూగజీవాలను రక్షించి సంక్షిస్తుండటంలో నిమగ్నమైంది.
లాక్డౌన్ వేళ ఆహారం
శునకాలకు ఆహారం అందిస్తున్న క్రమంలో సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోం ప్రాంగణంలో శ్రీవిద్య మట్టిపతి అనే గృహిణి పరిమయమయ్యారు. అప్పటికే ఆమె ఎన్నో వీధి శునకాలను దత్తత తీసుకుని పెంచుతున్నారు. లాక్డౌన్ సమయంలో దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో కుటుంబాలు వదిలేసిన ఎన్నో కుక్కలు, ఆకలి అలమటించేవాటిని ఈ ఇద్దరూ చేరదీశారు. ఒక్కో రోజు 200 కుక్కలకు భోజనం పెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఆర్థిక భారమైనా సరే ఈ ఇద్దరూ కలిసి రోజు 125 పైగా కుక్కులకు భోజనం అందించడం ఓ వ్యాపకంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.
హాని లేని దారంతో పతంగులు ఎగర వేయాలి
- డా.సింధూర పోతినేని
సంక్రాంతి వేళ యువత పతంగుల కోసం వాడే మాంజా గుడ్ల గూబలు, గద్దలు, ఇతర పక్షుల ప్రాణం మీదకు తెస్తోంది. దీన్ని తప్పించడానికి పక్షులకు హాని కలిగించని దారంతో ఎగరేసి సంబరాలు జరుపుకోవాలి. ఇంట్లోనే అత్యాధునిక ఇంక్యుబేటర్లు, కేజెస్తో పక్షుల సంరక్షణ కేంద్రం నెలకొల్పాలన్నది నా లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
[ 18-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ