ఆనందాల జల్లు నవకాంతుల పొదరిల్లు
సంక్రాంతి.. జీవితంలో కొత్త వెలుగులను పంచుతుంది. చీకటి నుంచి వెలుగు, అజ్ఞానం నుంచి విజ్ఞానం, చెడు నుంచి మంచి వైపు నడిపిస్తుంది. వారం ముందు నుంచే ఊరావాడ.. చిన్నాపెద్దను ఏకం చేస్తూ..
న్యూస్టుడే, సిద్దిపేట టౌన్
సంక్రాంతి.. జీవితంలో కొత్త వెలుగులను పంచుతుంది. చీకటి నుంచి వెలుగు, అజ్ఞానం నుంచి విజ్ఞానం, చెడు నుంచి మంచి వైపు నడిపిస్తుంది. వారం ముందు నుంచే ఊరావాడ.. చిన్నాపెద్దను ఏకం చేస్తూ.. ఎన్నో ఆనందాలను నింపుతుంది. ఎన్నో ప్రత్యేకతలు, విశేషాల సమాహారమే ఈ వేడుక. మూడు రోజులు.. ఆద్యంతం అలరిస్తుంది. భోగితో మొదలై.. సం‘క్రాంతి’ రూపంలో జీవితంలో నవ కాంతులను నింపుతుంది. కనుమ ద్వారా కనువిందు చేస్తుంది. పతంగుల రెపరెపలు.. అప్పాల కరకరలు.. రంగవళ్లులతో వాకిళ్ల అలంకరణలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆస్వాదిస్తే అద్భుతః అనాల్సిందే.
ఎన్నో విశిష్టతలు..
సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతారు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు సూచిస్తున్నాయి. ఈ పండుగ పుష్యమాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణశక్తి కలదని అర్థం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నింటిలో ఇది విశిష్టమైంది. దేవతలకు ఇష్టమైన కాలం. కనుమ కర్షకుల పండగ. పాడి పంటలు, పశు సంపద, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు.
ముగ్గులో నైపుణ్యం..
ఈ పండగ రాగానే గుర్తుకొచ్చేది ముగ్గులే. మగువలు ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతారు. ప్రతి వాకిలి.. శోభాయమానంగా వెలుగొందుతుంది. ఇందుకు మగువలు.. ముందు నుంచే సన్నద్ధమవుతారు. చుక్కల ముగ్గులు సహా విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. పండుగ రోజు వాకిళ్లు నూతన శోభను సంతరించుకుంటాయి. ఇక ఈ మాసంలో క్రిమికీటకాలు, ఇతరత్రావి ఇళ్లలోకి రాకుండా పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ఇంటి ముందు, గడపపై పెడతారు.
ఘుమఘుమల వెనుక..
పిండివంటలు.. నోరూరిస్తాయి. సుమారు వారానికి పైగా రకరకాల రుచులను ఆస్వాదిస్తాం. అప్పాలు.. చేగోళ్లు.. సఖినాలు.. మురుకులు.. నువ్వుల ముద్దలు.. అరిసెలు.. ఇలా ఎన్నో ప్రత్యేక వంటలు ఆకట్టుకుంటాయి. వాటిల్లో పోషకాలు పుష్కలం. వాడే పదార్థాలన్నీ రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. వివిధ రకాల విటమిన్లు అందుతాయి. బెల్లంతో తయారు చేసే పిండివంటల ద్వారా కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం లభిస్తాయి.
బుడతల్లో హుషారు..
అప్పటి వరకు బద్ధకంగా ఉండే చిన్నారులు సంక్రాంతి వస్తుందంటే వారిలో ఎంతో హుషారు కనిపిస్తుంది. పతంగుల రెపరెపలు.. దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్నాపెద్ద కేరింతలు కొడుతూ.. గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగం అంటే గరుడపక్షి. కాలస్వరూపుడైన తన వాహనం పక్షిపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తున్నాడని చెప్పడానికి సంకేతంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు.
మదిలో కొలువైన ‘మల్లన్న’
మూడు నెలల పెద్దజాతర
న్యూస్టుడే, చేర్యాల: తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం కొమురవెల్లి మల్లన్న ఆలయం. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మాలెగాం ప్రాంతంలో ‘ఖండోబా’ (మల్లికార్జున స్వామి) ఆలయం ఉందని, అక్కడి పూజారికి కలలోకి స్వామి వచ్చి తాను కొమురవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి చూడగా.. గుహలో శివలింగం కనిపించింది. ఎదురుగా కూర్చొని పూజలు చేయగా, కొన్నాళ్లకు శివలింగంపై పుట్ట పెరిగిందని, అదే పుట్టమట్టితో ‘మాలెగాం’లోని స్వామి రూపంలో విగ్రహాన్ని నిర్మించారని ప్రతీతి. శివుడే మల్లన్న రూపంలో వెలిశాడని భక్తుల విశ్వాసం. మల్లికార్జున స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ ఇద్దరు భార్యలు. స్వామివారి విగ్రహం ‘నాభి’యందు పుట్టు లింగం ఉండటంతో మట్టితో చేసిన విగ్రహమే అయినా శతాబ్దాలు గడుస్తున్నా చెక్కు చెదరడం లేదని పూజారులు చెబుతారు. రేణుకా ఎల్లమ్మ, అంజనేయ స్వామి, వీరభద్రుడి ఆలయాలున్నాయి. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది. సంక్రాంతి పండగ ముగిశాక వచ్చే మొదటి ఆదివారం మొదలయ్యే జాతర నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం (పాల్గుణ మాసం చివరిది) రాత్రి జరిగే అగ్నిగుండాలతో ముగుస్తుంది. ఇలా మూడు నెలల పాటు వేడుకలు జరుగుతాయి.
ప్రతి ఆదివారం సందడే..
న్యూస్టుడే, శివ్వంపేట: మండలంలోని సికింద్లాపూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మూడు నెలల పాటు ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి తరలివచిచ స్వామిని దర్శించుకుంటారు. మొక్కులు తీరిన వారు కోరికల రూపంలోనే వెండి, బంగారంతో చేయించి వివిధ రూపాల్లో కానుకలు సమర్పించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే మరెక్కడా లేనట్లుగా మూడున్నర అడుగుల ఎత్తయిన పాలరాతి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం గుట్టపై ప్రతిష్ఠించడం విశేషం. జాతర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
వెయ్యేళ్ల చరిత్ర..
మల్లన్న స్వామి ఆలయం
మిరుదొడ్డి, న్యూస్టుడే: మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామ శివారులోని బండ మల్లన్న ఆలయంలో జరిగే జాతర జానపదుల జన జాతరగా ప్రసిద్ధి చెందింది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఏటా సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. బోనాల ఊరేగింపు, బండ్ల ప్రదర్శన ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడి బండపై వెలిసిన మల్లన్న కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. గుట్టపై మల్లికార్జున స్వామి, అభయాంజనేయ స్వామి, రాజరాజేశ్వర స్వామి, ఎల్లమ్మ, పోచమ్మ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. సంక్రాంతి రోజు సాయంత్రం చుట్టూపక్కల రైతులు తమ ఎండ్లను, బండ్లను అందంగా అలంకరించి డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకొచ్చి ప్రదర్శన నిర్వహిస్తారు. ఇక గుట్టపై ఉన్న గుండం ఏ కాలంలోనూ ఎండిపోకుండా ఉండటం విశేషం. ఇందులోని జలం తీయగా ఉంటాయి. ప్రజలంతా ఒకే రోజు సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రదర్శనగా తరలివెళ్లి..
భక్తులు సమర్పించిన కానుకలతో కొత్తకొండ (మెడలో నోట్లదండ ఉన్న వ్యక్తి)
న్యూస్టుడే, అక్కన్నపేట (హుస్నాబాద్ గ్రామీణం): అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ లేని సందడి కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరిగే వీరభద్రస్వామి జాతరకు గ్రామస్థులందరూ ఎడ్లబండ్లపై ప్రదర్శనగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు 15 రోజుల ముందు నుంచే బండ్లను సిద్ధం చేస్తుంటారు. ఎడ్లు, బండ్లు లేని వారు ప్రత్యేకించి కొనుగోలు చేస్తారు. సంక్రాంతి రోజున అందంగా ముస్తాబు చేసి పూజలు జరుపుతారు. ఇక ఆ రోజు డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగిస్తారు. కత్తులతో ఖడ్గాలు వేస్తారు. వీరభద్రస్వామికి ప్రతినిధిగా భావించే కొత్తకొండ అనే వ్యక్తికి భక్తులు కానుకలు సమర్పిస్తారు. ఆయా వాటిని ఎడ్లబండిపై కొత్తకొండకు వెళ్లి వీరభద్రస్వామికి సమర్పిస్తారు. అతను నెల రోజులు ఉపవాసం చేస్తారు. 60 ఏళ్లుగా సంప్రదాయాన్ని సాగిస్తున్నారు.
ప్రత్యేకం గేవర్..
ఇంటి వద్ద గేవర్ తయారు చేస్తున్న హన్మప్ప కుటుంబ సభ్యులు
న్యూస్టుడే, తాండూరు టౌన్: సంక్రాంతి పండగకు తాండూరు పట్టణంలో ఎక్కువగా వినిపించే తీపి వంటకం గేవర్. ఇక్కడి హన్మప్ప కుటుంబం దీని తయారీలో సిద్ధహస్తులు. 80 ఏళ్ల కిందట మొదలైన ఈ వంటకం తయారీని ఇప్పటికీ ఓ సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే దీన్ని తయారు చేస్తారు. ఈ సమయంలో కుటుంబసభ్యులంతా శాఖాహారాన్నే తీసుకుంటూ పూర్తి నిష్ఠ పాటిస్తారు. కుటుంబంలోని 24 మంది కలిసి తయారు చేసి విక్రయిస్తుంటారు. గేవర్ తయారీకి మైదా పిండితో పాటు నెయ్యి, డాల్డా, పంచదార వినియోగిస్తారు. ఇక్కడి వారు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండేవారికి ఈ సమయంలో పంపిస్తుంటారు. ఇలా సంక్రాంతి వచ్చిందంటే గేవర్ కోసం బారులు తీరుతుండటం ఇక్కడ కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
[ 19-04-2024]
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!