Ts News: శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రెండోసారి కరోనా

తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెండో సారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో పోచారం

Updated : 16 Jan 2022 11:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెండో సారి కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో పోచారం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కొవిడ్‌ సోకినట్లు తేలింది. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీలో సభాపతి పోచారం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

గత ఏడాది నవంబరు 26న పోచారం మొదటిసారి కరోనా బారినపడ్డారు. నవంబరు 21న పోచారం మనవరాలి వివాహం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌లతో పాటు పలువురు రాజకీయ, అధికార ప్రముఖులు హాజరయ్యారు. వారందరినీ కలిసిన పోచారం.. పెళ్లి హడావుడి ముగిసిన అనంతరం తనతోపాటు కుటుంబసభ్యులు, సిబ్బందికి వైద్యపరీక్షలు చేయించారు. అందులో పోచారానికి కొవిడ్‌ నిర్ధారణ కాగా మిగిలిన వారెవరికీ సోకలేదు. పోచారం ఇప్పటికే రెండు కరోనా టీకా డోస్‌లు తీసుకున్నా తాజాగా వైరస్‌ సోకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని