osmania university: రేపట్నుంచి ఓయూ, జేఎన్టీయూహెచ్పరిధిలో ఆన్లైన్ తరగతులు
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో రేపటి నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈనెల 30 వరకూ ఓయూ పరిధిలో ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయని తెలిపింది. డిగ్రీ, పీజీ తరగతులకు ఆన్లైన్ తరగతులు ఉంటాయని పేర్కొంది. జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోనూ రేపట్నుంచి ఈ నెల 22 వరకు ఆన్లైన్ తరగతులు ఉంటాయని జేఎన్టీయూహెచ్ అధికారులు తెలిపారు. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా కోర్సులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో అన్ని విద్యాసంస్థలకు నేటితో ముగియనున్న సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఆరోగ్య శాఖ సిఫార్సు మేరకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్