logo

స్నానానికి చెరువులో దిగి... శవమై తేలి...

మాసాయిపేట మండలం అచ్చంపేట ఊర చెరువులో స్నానం చేయడానికి దిగి గల్లంతైన అదే గ్రామానికి చెందిన బొబ్బిళ్ల సురేష్‌ మృత దేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఇళ్లకు రంగులు వేసే పనులు చేయడానికి

Published : 17 Jan 2022 05:01 IST

మాసాయిపేట (వెల్దుర్తి), న్యూస్‌టుడే: మాసాయిపేట మండలం అచ్చంపేట ఊర చెరువులో స్నానం చేయడానికి దిగి గల్లంతైన అదే గ్రామానికి చెందిన బొబ్బిళ్ల సురేష్‌ మృత దేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఇళ్లకు రంగులు వేసే పనులు చేయడానికి స్నేహితులతో కలిసి సురేష్‌ అచ్చంపేటకు వచ్చాడు. తిరిగి మాసాయిపేటకు వెళ్తూ స్నానం చేయడానికి ఊర చెరువులోకి దిగగా మునిగిపోయాడు. శుక్రవారం, శనివారం చెరువులో ఎంతగా గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం సురేష్‌ మృతదేహం చెరువు నీటిలో తేలింది. గమనించిన అచ్చంపేట గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా వెలికి తీశామని ఎస్‌ఐ చెప్పారు. మృతుడు సురేష్‌ తల్లి కస్తూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని