logo

ద్విచక్ర వాహనాలపై యువకుల హల్‌చల్‌

యువకులు ద్విచక్ర వాహనాలపై హల్‌చల్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణిస్తున్న క్రమంలో కింద పడడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కనకయ్య వివరాల ప్రకారం మాదాపూర్‌కు చెందిన కృష్ణ కుమారుడు వెంకటసాయి(25)

Published : 17 Jan 2022 05:33 IST

కిందపడి ఒకరికి గాయాలు


విభాగినిని ఢీకొనడంతో ధ్వంసమైన వాహనం

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే:యువకులు ద్విచక్ర వాహనాలపై హల్‌చల్‌ చేస్తూ అతివేగంగా ప్రయాణిస్తున్న క్రమంలో కింద పడడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కనకయ్య వివరాల ప్రకారం మాదాపూర్‌కు చెందిన కృష్ణ కుమారుడు వెంకటసాయి(25) ఆదివారం 11మంది స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై మెహిదీపట్నం నుంచి జడ్చర్ల వెళ్తున్నారు. రోడ్డుపై అతివేగంగా ప్రయాణించారు. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు ప్రయాణిస్తున్న సమయంలో వెంకటసాయి వాహనం అదుపుతప్పి విభాగినిని ఢీకొట్టింది. అతడికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. యువకులంతా స్పోర్ట్స్‌ వాహనాలతో రైడింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కనకయ్య వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని