Crime News: రంగారెడ్డి జిల్లా యాచారంలో మళ్లీ చిరుతపులి కలకలం
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం రేగింది.
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం రేగింది. గతవారం నానక్నగర్లో ఓ మేకను చంపి తిన్న చిరుత.. తాజాగా మరో ఆవు దూడపై దాడి చేసింది. మండలంలోని పిల్లిపల్లి గ్రామంలో భిక్షపతి అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఆవు దూడపై దాడి చేసి చంపి తిన్నది. వారం రోజుల వ్యవధిలోనే రెండు మూగజీవాలపై చిరుత దాడి చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా మేడిపల్లి -కొత్తపల్లి, తాడిపత్రి గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో వరుస చిరుత దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడి చేసినప్పుడు అటవీ అధికారులు రావటం.. తాత్కాలికంగా బోనులు ఏర్పాటు చేయడం.. తర్వాత వెళ్లిపోవడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస చిరుత దాడులతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని వాపోతున్నారు. ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వణుకుపుడుతోందని.. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?