logo

రూ.2.4 లక్షల విలువైన గుట్కా, జర్దా ప్యాకెట్ల స్వాధీనం

జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వికారాబాద్‌ పట్టణ పోలీసులు వేర్వేరుగా మూడు చోట్ల గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. దాదాపు రూ.2.4 లక్షల విలువైన ప్యాకెట్లను సోమవారం స్వాధీనం

Published : 18 Jan 2022 02:25 IST

ఐదుగురిపై కేసు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వికారాబాద్‌ పట్టణ పోలీసులు వేర్వేరుగా మూడు చోట్ల గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. దాదాపు రూ.2.4 లక్షల విలువైన ప్యాకెట్లను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం..టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టణంలోని శివారెడ్డిపేట, ఎన్నెపల్లి సమీపంలోని కిళ్లీ దుకాణాల్లో తనిఖీలు చేసి రూ.1.4 లక్షల విలువైన 11,300 గుట్కా, ఇతర జర్దా ప్యాకెట్లు, సిగరెట్‌ ప్యాకెట్లు, హుక్కా ఫ్లేవర్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పట్టణ పోలీసులు సీఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మార్గంలోని రెండు కిరాణ దుకాణాల్లో రూ.లక్ష విలువైన 9,731 గుట్కా, జర్దా ప్యాకెట్ల నిల్వలను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని