రూపొందిన ప్రణాళిక.. అటకెక్కిన ఆచరణ
స్వయం సహాయక సంఘాల సభ్యులతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు సర్కారు సంకల్పించింది. తద్వారా ఆదాయం సమకూర్చడంతోపాటు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిశ్రమల ప్రారంభానికి ఆమోదం
ఏడాది గడిచినా అడుగులుపడని వైనం
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
నిరుపయోగంగా అతిథిగృహం
నిధులు: రూర్బన్ పథకం
నిర్వహణ: గ్రామీణాభివృద్ధి శాఖ
కార్యాచరణ: రెండు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు
పురోగతి: భవనాల ఎంపికకే పరిమితం
స్వయం సహాయక సంఘాల సభ్యులతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు సర్కారు సంకల్పించింది. తద్వారా ఆదాయం సమకూర్చడంతోపాటు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిశ్రమల ప్రారంభానికి ఆమోదం తెలిపారు. ఏడాది గడిచినా ఆచరణకు నోచడంలేదు. వెరసి వందలాది మంది మహిళలకు ఎదురుచూపులే మిగిలాయి. ఈనేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
రూర్బన్ పథకం నిధులతో తాండూరు మండలంలో చిన్నతరహా పరిశ్రమలను నెలకొల్పేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖరారు చేశారు. శానిటరీ న్యాప్కిన్స్ తయారీ, ప్లాస్టిక్ రహిత విస్తరాకుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటి నిర్వహణ బాధ్యత బృందాలకే అప్పగించాలని నిర్ణయించారు. ఉత్పత్తులను జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. తద్వారా పదులసంఖ్యలో అతివలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు డ్వాక్రా సంఘాలకు విరివిగా ఆదాయం పొందేలా కసరత్తు చేశారు. వ్యాపార కార్యకలాపాల్లో వారు రాణించేలా, భవిషత్తులో మరిన్ని కంపెనీల నిర్వహణకు బాటలు పడేలా ప్రోత్సహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రణాళికలు రూపొందించి, రూర్బన్ పథకం నుంచి వెచ్చించేందుకు సమాయత్తమయ్యారు.
వృథాగా మహిళా స్త్రీ శక్తి భవనం
భవనాలను ఎంపిక చేసి...: ప్రతిపాదనలను ఆచరణలో పెట్టాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భవనాల అన్వేషణ ఆరంభించారు. ఈక్రమంలో పాలనాధికారిణి పౌసుమిబసు, డీఆర్డీఓ కృష్ణన్ల బృందం తాండూరులో పర్యటించింది. పలు భవనాలను పరిశీలించారు. చివరకు తాండూరు మండల పరిషత్ కార్యాలయ పరిసరాల్లో నిరుపయోగంగా ఉన్న అతిథిగృహాన్ని పరిశీలించారు. ఇక్కడి భవనంలోని విశాలమైన గదులను పరిశీలించి శానిటరీ న్యాప్కిన్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పైకప్పుపై చిన్న మరమ్మతు చేయాల్సి ఉండగా వెంటనే పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ డీఈ వెంకట్రావ్, ఏఈ సంతోష్ను ఆదేశించారు. అనంతరం సమీపంలో వృథాగా ఉన్న మహిళా స్త్రీశక్తి భవనంలో ప్లాస్టిక్ రహిత విస్తరాకుల తయారీ కేంద్రం నెలకొల్పేందుకు పచ్చజెండా ఊపారు. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో విస్తరాలకు తయారీ, ఇతర ప్రాంతాలకు ఎగుమతులతో కాలుష్య నివారణకు కొంతైనా దోహదపడుతుందని వెంటనే ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతలోనే పాలనాధికారిణి బదిలీపై వెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులు విస్మరించారు. ప్రతిపాదనలు, ప్రణాళికలు అటకెక్కించారు. ఏకంగా జిల్లా పాలనాధికారిణి భవనాలు పరిశీలించి ఆమోదం తెలిపి ఏడాది గడిచినా పరిశ్రమల ఏర్పాటుకు నోచకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకటిరెండు నెలల్లో రెండు పరిశ్రమలు అందుబాట్లోకి వస్తాయని అంతా భావించినా ఏడాది నుంచి ఎదురుచూపులు మిగలడంపై పెదవి విరుస్తున్నారు.
నిధులు సిద్ధంగా ఉన్నా..
రూర్బన్ పథకం ద్వారా తాండూరు మండలానిక రూ.18కోట్లు మంజురయ్యాయి. వాటిలో ఇప్పటివరకు దాదాపు రూ.14కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా రూ.4కోట్లు మిగిలిఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసి చిన్నతరహా పరిశ్రమలను ప్రారంభిస్తే తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలతోపాటు పట్టణంలోని మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఇక్కడి పరిశ్రమలు విజయవంతమైతే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రారంభించేందుకు ఆస్కారమేర్పడనుంది. తద్వారా జిల్లా వ్యాప్తంగా ఉత్పత్తులు, ఎగుమతులు మొదలైతే జిల్లావాసులు నగరాల నుంచి దిగుమతులు చేసుకునే బాధలు తప్పనున్నాయి. అవసరమైతే సరిహద్దునున్న కర్ణాటకకు ఎగుమతి చేస్తే మహిళలకు మరింత ఆదాయం, ఉపాధికి భరోసా లభించనుంది. స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు తోడ్పడనున్నాయి. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల