logo

జీఆర్పీ పోలీసుల స్పందన.. తప్పిన ప్రాణాపాయం

కుమార్తెను రైలెక్కించి నడుస్తున్న రైలు దిగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి రైలు, ఫుట్‌పాత్‌ల మధ్య ఓ వ్యక్తి పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్పందించిన

Published : 18 Jan 2022 02:24 IST

బాలకృష్ణ రెనివాల్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: కుమార్తెను రైలెక్కించి నడుస్తున్న రైలు దిగే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి రైలు, ఫుట్‌పాత్‌ల మధ్య ఓ వ్యక్తి పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్పందించిన జీఆర్పీ కానిస్టేబుళ్లు రైలును నిలుపడంతో అతడు స్వల్పగాయాలకు గురై ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాలు జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. హైటెక్‌ సిటీలో ఉండే బాలకృష్ణ రెనివాల్‌ తన కుమార్తెను రైలెక్కించేందుకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చాడు. సోమవారం సాయంత్రం 6.25గంటలకు స్టేషన్‌లోని ఒకటో ప్లాట్‌ఫాంపై బోగీలో ఆమెను ఎక్కించి రైలు దిగుతున్నాడు. అదే సమయంలో రైలు బయలుదేరడంతో  జారి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయాడు. ప్లాట్‌ఫాంపై ఉన్న జీఆర్పీ హెడ్‌కానిస్టేబుళ్లు డేవిడ్‌రాజ్‌, శ్రీనివాస్‌లు వెంటనే రైలెక్కి చైన్‌లాగి రైలును నిలిపారు. అతడిని బయటకు తీశారు. తలకు స్వల్ప గాయం కావడంతో వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని