రూ.1000 కోట్లు కాజేశారా?
అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. బ్యాంకులను బురిడీ కొట్టించగల నైపుణ్యం. అందరూ ఒక్కచోటికి చేరి ముఠాగా ఏర్పడ్డారు. అనుభవమే పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టారు. ఇటీవల నకిలీ కాల్సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించిన
ఇటీవల నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సీపీయూను పరిశీలిస్తున్న సీపీ స్టీఫెన్ రవీంద్ర
ఈనాడు, హైదరాబాద్: అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. బ్యాంకులను బురిడీ కొట్టించగల నైపుణ్యం. అందరూ ఒక్కచోటికి చేరి ముఠాగా ఏర్పడ్డారు. అనుభవమే పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టారు. ఇటీవల నకిలీ కాల్సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించిన సైబర్ముఠాను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వ్యవధిలోనే ముఠా రూ.1000 కోట్ల మేర కాజేసి ఉండవచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. కేసులో కీలక సూత్రధారి నవీన్ భుటాని కనుసన్నల్లోనే వ్యవహారం సాగింది. బ్యాంకింగ్ రంగంలో పనిచేయటం వల్ల ఇతడికి ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్కార్డులపై పట్టుంది.
విదేశీ కార్డులే ఎందుకంటే
ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు జరిపే ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నారు. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ల్లో ఉపయోగించే అధికశాతం అంతర్జాతీయ క్రెడిట్కార్డులకు భారతదేశంలోని బ్యాంకులు ఫ్రాంచైజ్గా ఉండటంతో వీటిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. అంతర్జాతీయంగా ఖాతాదారులు చేసే కొనుగోళ్లు, నగదు చెల్లింపునకు కార్డునంబరు, సీవీవీ, ఎక్స్పైరీ తేదీ ఉంటే సరిపోతుంది. ఇక్కడి మాదిరిగా ఓటీపీ ఉపయోగించాల్సిన అవసరం లేదు.ఈ అవకాశమే కాసులు కురిపించింది. టోల్ఫ్రీ నంబర్లు, ఐపీ చిరునామాలు విదేశాల్లో నిర్వహిస్తున్నట్టుగా ట్యాంపరింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ తరహా మోసాల్లో క్రెడిట్కార్డుల నుంచి నగదు చెల్లింపులు జరిగినా తాము క్రెడిట్కార్డు ఉపయోగించిన సమయంలో అక్కడే ఉన్నట్టుగా ఆధారాలు చూపి ఖాతాదారులు తమ నగదు వెనక్కి తెచ్చుకుంటున్నారు. అంతర్జాతీయ క్రెడిట్కార్డుల సొమ్ము కాజేసిన ముఠా వెనుక దుబాయ్కు చెందిన ముగ్గురు నిందితులు సాయపడ్డారు. పేమెంట్ గేట్వేల ద్వారా కాజేసిన నగదును విదేశాలకు చేరవేశారు. నాలుగైదు దేశాలకు చెందిన హవాలా ముఠాలతో వీరికి సంబంధాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతుంది. చీకటి కార్యకలాపాలను అటు నిఘా వర్గాలు, ఇటు బ్యాంకింగ్ విభాగాలు గుర్తించకపోవటంతో మొదటిసారి ఉపయోగించిన టోల్ఫ్రీ నంబరు ద్వారా లక్షమందిని, రెండో టోల్ఫ్రీ నంబరుతో 33,000 మంది నుంచి రూ.కోట్లు కాజేశారు. ప్రస్తుతం సైబర్ పోలీసులు విదేశాల్లోని క్రెడిట్కార్డు వినియోగదారుల సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను విచారించేందుకు పోలీసులు సోమవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి