ఇలా బిల్లు.. అలా చెల్లింపు
ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఎక్కువగా ఆయా సంస్థల ఉద్యోగులు నివసిస్తుంటారు. కరెంట్ బిల్లు చేతికి ఇవ్వగానే వెంటనే ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. కొత్త బిల్లు చూపకపోవడంతో వెంటనే బిల్లు కట్టలేకపోయేవారు. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. విద్యుత్తు సంస్థ సైతం తొలిరోజే ....
స్మార్ట్ విద్యుత్తు బిల్లింగ్ ప్రయోగం విజయవంతం
ఈనాడు, హైదరాబాద్
ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఎక్కువగా ఆయా సంస్థల ఉద్యోగులు నివసిస్తుంటారు. కరెంట్ బిల్లు చేతికి ఇవ్వగానే వెంటనే ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. కొత్త బిల్లు చూపకపోవడంతో వెంటనే బిల్లు కట్టలేకపోయేవారు. సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. విద్యుత్తు సంస్థ సైతం తొలిరోజే వచ్చే రెవెన్యూను కోల్పోయేది. సమస్యను గుర్తించిన టీఎస్ఎస్పీడీసీఎల్ పాత స్పాట్ బిల్లింగ్ యంత్రాల స్థానంలో స్మార్ట్ బిల్లింగ్ యంత్రాలు (ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్ మెషిన్-ఐఎస్బీఎం)లను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకంగా చిప్ ఉంటుంది. బిల్లు తీయడమే ఆలస్యం జీపీఆర్ఎస్ సాయంతో వెంటనే రికార్డుల్లో కొత్త బిల్లు చూపిస్తుంది. గత ఏడాది ప్యారడైజ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. క్రమంగా బంజారాహిల్స్, గ్రీన్ల్యాండ్స్కు విస్తరించారు. ప్రస్తుతం మిగిలిన డివిజన్లలోనూ ఐఎస్బీఏంతోనే బిల్లులు తీసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
రెండు నెలల్లో..
గ్రేటర్లో ప్రతినెలా రెండు మూడు తేదీల్లో బిల్లింగ్ మొదలై రెండువారాలపాటు కొనసాగుతుంది. ప్రస్తుతమున్న విద్యుత్తు మీటర్లన్నీ ఐఆర్ఫోర్ట్వే. బిల్లింగ్ మిషన్లను మీటర్ల సమీపంలోకి తీసుకెళ్లి చూపించగానే ఆటోమెటిక్గా బిల్లు వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకరోజు బిల్లులన్నీ తీశాక సదరు మీటర్ రీడర్ను సాయంత్రం కార్యాలయానికి వెళ్లి అనుసంధానిస్తేనే ఆన్లైన్లో చూపిస్తుంది. కాబట్టి స్పాట్లో బిల్లుల చెల్లింపులు ఉండేవి కావు. ‘జీపీఆర్ఎస్ సాయంతో ఇంటిగ్రేటెడ్ స్పాట్ బిల్లింగ్తో ఈ సమస్య తీరిపోనుంది. మొదట కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాం. మంచి ఫలితాలు వచ్చాయి. రెండునెలల్లో నగరం మొత్తం ఈ పక్రియ పూర్తవుతుంది. అప్పుడు సిటీలోని ఏ వినియోగదారైనా బిల్లు వచ్చిన వెంటనే ఆన్లైన్లో చెల్లించవచ్చు’ అని టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కె.శ్రీనివాస్ ‘ఈనాడు’కు తెలిపారు.
బిల్ రీడర్ మీ ఇంటి ప్రాంగణంలో ఉండగానే మొబైల్కు బిల్లు సందేశం వస్తుంది కాబట్టి.. ఒకవేళ అధిక బిల్లు వస్తే వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. తప్పుగా ఉంటే వెంటనే కొత్త బిల్లు జారీ చేసే అవకాశం ఐఎస్బీఎంతో ఉందని డీఈ ఒకరు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో (అక్టోబరు 1, 2021 నాటికి)
మొత్తం వినియోగదారులు 53.52 లక్షలు
గృహ ।। 43.93 లక్షలు
వాణిజ్య ।। 7,22,000
ఎల్టీ పరిశ్రమలు 35,110
హెచ్టీ పరిశ్రమలు 7,490
ఇతర 1,94,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?