TS News: భాజపా రాష్ట్ర కార్యాలయానికి భద్రత పెంపు

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భాజపా

Published : 19 Jan 2022 21:42 IST

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భాజపా కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అబిడ్స్‌ సీఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయం మొత్తాన్ని తనిఖీ చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట ఎలాంటి వాహనాలు నిలుపరాదని ఆదేశించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయ సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని