logo

వాహనం చెట్టుకు ఢీకొని దుర్మరణం

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు..

Published : 20 Jan 2022 01:46 IST

కౌడిపల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన గోవింద్‌ నానోబా గైక్వాడ్‌ (30) హైదరాబాద్‌లోని ఓల్డ్‌ అల్వాల్‌కు వచ్చి కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌ నుంచి మెదక్‌కు బయలుదేరగా కౌడిపల్లి గ్రామ శివారులోని భట్టెమ్మ ఆలయం వద్దకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొన్నారు. ప్రమాదంలో గోవింద్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం విషయమై కుటుంబ సభ్యులకు పోలీసులు చరవాణి ద్వారా సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య జ్యోతి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవపరీక్ష నిర్వహించి కుటుంబీకులకు అప్పగించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని