Crime News: హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతున్న సంపన్నులను గుర్తించాం: సీవీ ఆనంద్
డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుగు టోనీని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుగు టోనీని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముంబయిలో అతడిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఇవాళ హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ‘‘2013లో వీసాపై టోనీ నైజీరియా నుంచి ముంబయి వచ్చాడు. వీసా గడువు ముగిసినా ముంబయిలోనే ఉంటున్నాడు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో సంపన్నులు ఉన్నారు.
హైదరాబాద్లో డ్రగ్స్ వాడుతున్న 13 మంది సంపన్నులను గుర్తించాం. వారిలో 9 మందిని అరెస్టు చేశాం. టోనీతో సంబంధాలు పెట్టుకొని వీరు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై న్యాయనిపుణుల సలహాలతో కేసులు పెడుతున్నాం’’ అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె