చిన్నారిపై అత్యాచారం.. వృద్ధుడికి ఐదేళ్ల కారాగారం
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. దీంతో పాటు బాధిత చిన్నారికి రూ.2లక్షలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్టుడే: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. దీంతో పాటు బాధిత చిన్నారికి రూ.2లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేస్తూ సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఆర్.తిరుపతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంగర రాజిరెడ్డి కథనం ప్రకారం.. మేడ్చల్జిల్లా నేరెడ్మెట్లోని సైనిక్పురికి చెందిన షేక్ హైదర్ అలియాస్ యూసుఫ్ (77).. 2020 జనవరి 30న ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి(6)కి మిర్చి బజ్జీలు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి నేరెడ్మెట్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండుకు తరలించి బాలికకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మల్కాజిగిరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్తో నేర విచారణ చట్టం సెక్షన్ 164 ప్రకారం పాప వాంగ్మూలాన్ని సవివరంగా రికార్డు చేయించారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై సమగ్ర ఆధారాలతో పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు.
కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
చేగుంట, న్యూస్టుడే: అత్తింట కట్నం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చేగుంటలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన నేహా సుల్తానా (22)ను రెండేళ్ల కిందట చేగుంటకు చెందిన ఇబ్రహీంకు ఇచ్చి వివాహం చేశారు. రూ.లక్ష నగదు, తులన్నర బంగారం, ఇతర కానుకలు ఇచ్చారు. కట్నం చాలలేదని పెళ్లి అయిన రెండు మాసాల నుంచే భర్త ఇబ్రహీం, అత్త షేక్ ఖైరున్నీసా, మామ యూసుఫ్, మరిది అఖిల్, తోటికోడలు మస్రత్లు వేధించడం ప్రారంభించారు. దీంతో సుల్తానా బంధువులు పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తన తల్లి హైమదీ బేగంకు ఆమె ఫోన్చేసి వేధింపులు భరించలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేయగా సర్దుకుపొమ్మని సూచించింది. తర్వాత అరగంటకు సుల్తానా మామ యూసుఫ్ ఆమె తల్లికి ఫోన్ చేసి మీ కుమార్తె పడకగదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో ఆమె చేగుంటకు చేరుకుని ఫ్యాన్కు వేలాడుతున్న కుమార్తె మృతదేహాన్ని చూసిన కన్నీరు మున్నీరుగా విలపించింది. కట్నం వేధింపులు భరించలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న హైమదీ బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమెకు 14 నెలల కుమార్తె ఉండగా తల్లి మృతితో బేలచూపులు చూస్తున్న చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్