logo

ఆరుగురు అధికారుల సస్పెన్షన్‌

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ గురువారం సస్పెండ్‌ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

Published : 21 Jan 2022 01:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ గురువారం సస్పెండ్‌ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం చూపిన శంషాబాద్‌ ఎంపీడీవో వినయ్‌కుమార్‌, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహేశ్‌బాబు, అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చిన శంషాబాద్‌ ఎంపీవో సురేందర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధులలో అలసత్వం ప్రదర్శించిన షాబాద్‌ ఏపీవో వీరాసింగ్‌, ఎక్స్‌ఈసీ పి.పవన్‌కుమార్‌, మంచాల ఏపీవో కె.వీరాంజనేయులపైనా సస్పెన్షన్‌ వేటు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని