logo

వ్యవసాయ శాఖలో త్వరలోనే పదోన్నతులు

వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని మంత్రి సిరగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం (టీఏవోఏ) దైనందిని

Published : 21 Jan 2022 01:27 IST
దైనందిని ఆవిష్కరిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్ఢి చిత్రంలో కరుణాకర్‌రావు, షర్మిల, సత్యనారాయణ,
బి.కృపాకర్‌రెడ్డి, జి.కృపాకర్‌రెడ్డి, వైద్యనాథ్‌, రాజేష్‌ చైతన్య

నారాయణగూడ, న్యూస్‌టుడే: వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని మంత్రి సిరగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం (టీఏవోఏ) దైనందిని ఆవిష్కరణ సభ గురువారం అబిడ్స్‌లో జరిగింది. సంఘం ఛైర్మన్‌ బి.కృపాకర్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వైస్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.కృపాకర్‌రెడ్డి, కోశాధికారి విజయకుమార్‌, హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి షర్మిల, మంత్రి లైజనింగ్‌ అధికారి కరుణాకర్‌రావు, సంగారెడ్డి టీజీవో అధ్యక్షులు వైద్యనాథ్‌, సంఘం నేత రాజేష్‌ చైతన్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని