logo

బల్దియాకు ఇద్దరు అదనపు కమిషనర్లు

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల్ని అదనపు కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన

Published : 21 Jan 2022 01:27 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థకు ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల్ని అదనపు కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సాధారణ ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా శృతిఓజా, పౌసుమి బసు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరిలో శృతి ఓజాకు గతంలో జీహెచ్‌ఎంసీలో పనిచేసిన అనుభవం ఉంది. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఎస్టేట్స్‌, క్రీడల విభాగాలకు అదనపు కమిషనర్‌గా పని చేశారు. అనంతరం జోగులాంబ గద్వాల జిల్లాకు పాలనాధికారిగా బదిలీపై వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ఆరుగురు అదనపు కమిషనర్లు ఉండగా.. తాజా నియామకాలతో ఇప్పుడా సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని