logo

చంద్రబాబు కోలుకోవాలని పూజలు

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌లు కరోనా నుంచి కోలుకోవాలని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కని నర్సింలు

Published : 21 Jan 2022 01:27 IST

మొయినాబాద్‌: తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌లు కరోనా నుంచి కోలుకోవాలని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు బక్కని నర్సింలు ఆధ్వర్యంలో పలువురు నేతలు చిలుకూరు బాలాజీని గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సన్నిధిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు సుభాష్‌యాదవ్‌, ప్రధానకార్యదర్శి వెంకట్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని