logo

కత్తి చూపినా.. బెదరని పద్మమ్మ

గొంతుకు కత్తిపెట్టినా గొలుసు విడవకుండా ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. చోరీకి యత్నించిన దొంగను నిలువరించింది. కత్తితో దాడిచేసి పారిపోయాడా దుండగుడు. బాధితురాలి

Published : 21 Jan 2022 02:11 IST

గొలుసు వదల్లేదని దుండగుడి దాడి

పద్మమ్మ

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: గొంతుకు కత్తిపెట్టినా గొలుసు విడవకుండా ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. చోరీకి యత్నించిన దొంగను నిలువరించింది. కత్తితో దాడిచేసి పారిపోయాడా దుండగుడు. బాధితురాలి వివరాల మేరకు... రాజేంద్రనగర్‌ ఠాణా పరిధి ఉప్పర్‌పల్లికి చెందిన భుజంగరెడ్డి, పద్మమ్మ(48) దంపతులు. వారి ఇంటికి ‘టు లెట్‌’ బోర్డు పెట్టారు. బుధవారం ఓ వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకు కావాలన్నాడు. ఇల్లు చూసుకొని గురువారం వస్తానని చెప్పి వెళ్లాడు. గురువారం రాత్రి వచ్చాడు. పద్మమ్మతో మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరూలేకపోవడాన్ని చూసి కత్తిని ఆమె మెడపై పెట్టి బెదిరించాడు. మంగళసూత్రాన్ని తెంచడానికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. కొద్దిసేపు పెనుగులాడటంతో కత్తి కిందపడింది. దొంగ పద్మమ్మ కాలుపై దాడిచేశాడు. అప్పటికే ఆమె అరుపులు విని పక్కింటి మహిళ రావడంతో అతను పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితురాలికి ఆరు కుట్లు పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని