logo

కర్రతో కొట్టి.. రైలు ప్రయాణికుల ఫోన్లు కొట్టేస్తూ

రైల్లో డోర్‌ వద్ద ఫోన్‌ మాట్లాడుతున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని పట్టాల పక్కన నిల్చొని కర్రతో కొట్టి కిందపడిన ఫోన్లు తీసుకుని ఉడాయిస్తున్న నిందితుడిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 22 Jan 2022 02:13 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రైల్లో డోర్‌ వద్ద ఫోన్‌ మాట్లాడుతున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని పట్టాల పక్కన నిల్చొని కర్రతో కొట్టి కిందపడిన ఫోన్లు తీసుకుని ఉడాయిస్తున్న నిందితుడిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఘట్‌కేసర్‌ ప్రాంతానికి చెందిన కూలీ కంది సతీష్‌(21)   పట్టాల పక్కన నిల్చొని రైలు మూలమలుపుల వద్ద నెమ్మదించగానే డోర్‌ వద్ద ఫోన్‌ మాట్లాడుతున్న ప్రయాణికులను కర్రతో చేతిపై కొట్టేవాడు. ఫోన్‌ కిందపడగానే తీసుకునే ఉడాయించేవాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అవుటర్‌లోని పట్టాల పక్కన తిరుగుతున్న నిందితుడిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని