logo

విద్యుదాఘాతంతోనాలుగేళ్ల బాలుడి మృతి

విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం... జల్‌పల్లి పురపాలిక ఎర్రకుంటకు చెందిన వ్యాపారి మొహ్మద్‌ సిరాజుద్దీన్‌ కుమారుడు సుఫియన్‌(4) శుక్రవారం

Updated : 22 Jan 2022 05:18 IST


సుఫియన్‌

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం... జల్‌పల్లి పురపాలిక ఎర్రకుంటకు చెందిన వ్యాపారి మొహ్మద్‌ సిరాజుద్దీన్‌ కుమారుడు సుఫియన్‌(4) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నానాల గదిలోకి వెళ్లి బకెట్‌లో నీళ్లు వేడిచేస్తున్న కరెంటు హీటర్‌ను చేతులతో బయటకు తీశాడు. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రగాయాల పాలైన బాలుడిని తల్లితండ్రులు ఓవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో సుఫియన్‌ మృతిచెందాడు. ఫిర్యాదు అందుకున్న బాలాపూర్‌ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని