logo

నార్సింగి బంగార్రాజు

నార్సింగి పట్టణానికి చెందిన వార్డు కౌన్సిలర్‌ పత్తి శ్రీకాంత్‌ శుక్రవారం పశువుల జాతరలో తళుక్కున మెరిశారు. ఆయన మెడలో రెండు భారీ బంగారు గొలుసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా..

Published : 22 Jan 2022 02:13 IST

నార్సింగి న్యూస్‌టుడే: నార్సింగి పట్టణానికి చెందిన వార్డు కౌన్సిలర్‌ పత్తి శ్రీకాంత్‌ శుక్రవారం పశువుల జాతరలో తళుక్కున మెరిశారు. ఆయన మెడలో రెండు భారీ బంగారు గొలుసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విషయమై ఆయనను ప్రశ్నించగా..గతంలో తాను బహ్రేయిన్‌లోని రాజమందిరంలో ఉద్యోగం చేసే వాడినని, అప్పుడు జీతం డబ్బులతో 1993లో ఈ బంగారు గొలుసులు కొనుక్కున్నానని వివరించారు. అతి ముఖ్యమైన సందర్భాలలో మాత్రమే వాటిని ధరిస్తానన్నారు. మిత్రుల కోరిక మేరకు ఈ రోజు ధరించానన్నారు. వాటి బరువు, విలువకు సంబంధించిన సమాచారం వెల్లడించేందుకు నిరాకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు