logo

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

భార్యతో పాటు వారి కుటుంబీకులు తీవ్రంగా వేధిస్తున్నారని, తన మరణానికి వారే కారణమంటూ ఓ వ్యక్తి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం...

Published : 22 Jan 2022 06:59 IST


శ్రావణ్‌కుమార్‌

బాలాపూర్‌, న్యూస్‌టుడే: భార్యతో పాటు వారి కుటుంబీకులు తీవ్రంగా వేధిస్తున్నారని, తన మరణానికి వారే కారణమంటూ ఓ వ్యక్తి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం... బడంగ్‌పేట లక్ష్మీదుర్గాహిల్స్‌ కాలనీకి చెందిన శ్రీరాముల శ్రావణ్‌కుమార్‌(35) సెలూన్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. ఆయనకు జనగాం జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన రవళితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమార్తె. పాప జన్మించిన కొన్ని రోజులకు వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమవడంతో రవళి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో 20 రోజుల క్రితం రవళి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. దీంతో మనస్తాపం చెందిన శ్రావణ్‌కుమార్‌ గురువారం రాత్రి కాలనీలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దూకి ఆత్మహత్మ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని