logo

పని ఇస్తే ప్రాణం తీశాడు

జీవనోపాధి కల్పించిన యజమానినే కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. కేవలం రూ.500 ఇవ్వలేదని యజమానిని ఇనుప పనిముట్లతో కొట్టడడంతో అక్కడికక్కడే ఊపిరొదిలాడు. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం..

Published : 22 Jan 2022 07:00 IST

రూ.500 ఇవ్వలేదని హత్య


బీరేందర్‌

జీడిమెట్ల, న్యూస్‌టుడే: జీవనోపాధి కల్పించిన యజమానినే కిరాతకంగా హతమార్చాడు ఓ వ్యక్తి. కేవలం రూ.500 ఇవ్వలేదని యజమానిని ఇనుప పనిముట్లతో కొట్టడడంతో అక్కడికక్కడే ఊపిరొదిలాడు. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. బీరేందర్‌కుమార్‌ సేత్‌ అలియాస్‌ మన్నన్‌(55) ఉత్తరప్రదేశ్‌ నుంచి 30 ఏళ్ల కిందట నగరానికి వలసొచ్చాడు. భార్య హేమలత ముగ్గురు పిల్లలతో కలిసి చింతల్‌ కల్పన సొసైటీలో నివసిస్తూ సమీపంలోని గణేశ్‌నగర్‌లో మెకానిక్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ముగ్గురు వ్యక్తులను పనికి పెట్టుకొన్నాడు. నెల రోజుల కిందట రోడామిస్త్రీనగర్‌కు చెందిన జహీర్‌ బీరేందర్‌ పనికి కుదిరాడు. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో డబ్బు కావాలని యజమాని బీరేందర్‌ను కోరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జహీర్‌ ఇనుప పానాలతో యజమానిని విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక బీరేందర్‌ కుప్పకూలాడు. నిందితుడు పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బీరేందర్‌ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని