యూబీఐ మాజీ మేనేజర్ మస్తాన్వలికి షాక్
తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో కీలక నిందితుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్వలిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ కేసులో బెయిల్
బెయిల్ పొందిన కొద్దిసేపటికే అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
ఈనాడు, హైదరాబాద్: తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో కీలక నిందితుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజర్ మస్తాన్వలిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వద్దామనుకున్న ఆయన సీసీఎస్ పోలీసుల అరెస్ట్తో షాక్కు గురయ్యారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల కేసులో అరెస్ట్ చేస్తున్నామని జైలు అధికారులకు చెప్పారు. గిడ్డంగుల సంస్థ ప్రతినిధులు గతేడాది జనవరిలో యూబీఐ, కార్వాన్ శాఖలో రూ.3.98 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. అప్పుడు మేనేజర్గా ఉన్న మస్తాన్వలి ఆ మొత్తానికి సమానమైన ఎఫ్డీ పత్రాలు ఇవ్వాల్సి ఉండగా.. నకిలీ రసీదులు ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఎఫ్డీల కాలపరిమితి ముగియడంతో బ్యాంక్కు ఆ రసీదులతో రాగా.. నకిలీవని తేలింది. దీంతో ప్రస్తుత యూబీఐ బ్యాంక్ మేనేజర్ ఈనెల 13న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంతపని చేశావ్.. మస్తాన్వలి అక్రమాలపై బ్యాంక్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. తెలుగు అకాడమీ అధికారులు యూబీఐ కార్వాన్ శాఖలో రూ.54.05 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. బ్యాంక్ మేనేజరే నకిలీ రసీదులు ఇచ్చినందున ఆ డబ్బు ఇవ్వాల్సిందేనని లేఖ రాయడమే ఇందుకు కారణం. ఎందుకంటే కెనరా బ్యాంక్లోనూ తెలుగు అకాడమీ అధికారులు రూ.10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అక్కడ మాజీ మేనేజర్ సాధన నకిలీ రసీదులు ఇచ్చారు. బ్యాంక్ పరువు పోకుండా ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు తెలుగు అకాడమీ ఖాతాల్లో రూ.10 కోట్లు జమచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!