కేసులుండగానే కాసుల వేట
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా.. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నప్పుడే కాసులు వేట ప్రారంభించేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల నుంచి మొదలుపెడితే పల్స్రేటు, ఆక్సిజన్ స్థాయిలు తెలిపే ఆక్సీమీటర్ తదితర పరికరాల
భారీగా పెరిగిన కొవిడ్ పరీక్షల, పరికరాల ధరలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఉప్పల్ మోడల్ మార్కెట్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం 663 మందికి పరీక్షలు చేయగా 95 మందికి పాజిటివ్ వచ్చింది.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా.. కరోనా కేసులు ఉద్ధృతంగా ఉన్నప్పుడే కాసులు వేట ప్రారంభించేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల నుంచి మొదలుపెడితే పల్స్రేటు, ఆక్సిజన్ స్థాయిలు తెలిపే ఆక్సీమీటర్ తదితర పరికరాల ధరలను భారీగా పెంచేశారు విక్రయదారులు. బూస్టర్ డోసుకు డిమాండ్ పెరిగింది. 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రస్తుతం అధికారికంగా వేస్తుండగా ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.2500కు పైగా తీసుకొని అనధికారికంగా చేసేస్తున్నారు.
నగరంలో కరోనా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. మొదటి, రెండు దశల్లో వైరస్ విజృంభించినపుడు ప్రైవేటు ల్యాబ్లు నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రజలను దోచేశాయి. పరీక్షకు రూ.500 తీసుకోవాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.2500 వరకు గుంజిన సందర్భాలున్నాయి. నెల రోజులుగా కేసులు పెరగడంతో ఉచితంగా పరీక్ష చేసే ప్రభుత్వ కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వందలాది మంది కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. కిట్లు సరిపోక పలువురు వెనుదిరుగుతున్నారు. రద్దీ చూసి భయపడేవారిని, నిరీక్షించలేని వారిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు ల్యాబ్లు మళ్లీ దోపిడీకి తెరలేపాయి. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష(ర్యాట్కు) రూ.1500, ఆర్టీపీసీఆర్ టెస్ట్కు రూ.2000కు పైగా వసూలు చేస్తున్నాయి.
అనధికారికంగా రూ.2500కు బూస్టర్ డోసు
గ్రేటర్తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో మొదటి డోసు వేయించుకున్న చాలామంది రెండో డోసు వేయించుకోలేదు. మొదటి డోసు వేయించుకున్నాక కేసులు తగ్గిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్తోపాటు, డెల్టా వైరస్ మళ్లీ విరుచుకుపడటంతో రెండో డోసు కోసం టీకా కేంద్రాలకు జనం పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. బూస్టర్ వేసుకుంటే 80 శాతం వరకు రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతుండడంతో దానికీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడినవారికే ఈ డోసు వేస్తున్నారు. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.2500 వరకు తీసుకొని ఆ డోసు వేస్తున్నాయి.
కొండెక్కి కూర్చున్న ఆక్సీమీటర్ ధర
కొవిడ్ బాధితులకు పల్స్ ఆక్సీమీటర్ కీలక పరికరం. కొవిడ్కు ముందు రూ.500 ఉండే ధర మొదటి, రెండు దశ ఉద్ధృతిలో రూ.2000 పలికింది. గత మూడు నెలలుగా ధర తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఔషధ దుకాణాల నిర్వాహకులు రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు పలువురు వీటిని కొనుగోలు చేస్తుండడమే దీనికి కారణం. రక్తపోటు, మధుమేహం పరీక్షల కిట్ల ధరలు పెరిగాయి. పాత ధరలకంటే రూ.500-రూ.1000 వరకు పెంచి అంటగడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM