శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోటి 36లక్షల విలువైన 2715.800గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. ఆ వ్యక్తి తన బ్యాగులో రెండున్నర కిలోలకు పైగా ఉన్న గోల్డ్ చైన్లతో పాటు బంగారాన్ని పేస్టుగా చేసి తీసువచ్చాడు. ఆ బంగారాన్ని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.