హైదరాబాద్‌లో వరుస గొలుసు దొంగతనాలు.. పోలీసుల అదుపులో నిందితుడు!

నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ఉమేశ్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 22 Jan 2022 14:10 IST

హైదరాబాద్‌: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ఉమేశ్‌ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మదాబాద్ పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం బృందాలుగా గుజరాత్ వెళ్లారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అహ్మదాబాద్‌లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు.

ఈ నెల 19న ఉదయం 11 గంటల నుంచి 5 గంటలలోపు కమిషనరేట్ల పరిధిలో స్కూటీపై వెళ్లి మూడు 5 గొలుసు దొంగతనాలు చేశాడు. నిందితుడు దొంగతనాలకు ఉపయోగించిన స్కూటీని కూడా జియాగూడలో ఈ నెల 18వ తేదీన చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఉమేశ్‌పై అహ్మదాబాద్, ముంబయిలోనూ దొంగతనాల కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని