TS news : పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్‌ అహ్మద్‌, ప్రశాంతి, సత్యనారాయణ

Published : 22 Jan 2022 17:55 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్‌ అహ్మద్‌, ప్రశాంతి, సత్యనారాయణ, హర్విందర్‌ సింగ్‌లకు సెలెక్షన్‌ గ్రేడ్‌ పదోన్నతి కల్పించారు. శశాంక, శ్రుతి ఓజా, శివలింగయ్య, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్‌కుమార్‌, హైమావతి, హరితలకు జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ స్కేల్‌ పదోన్నతి లభించింది. 1997 బ్యాచ్‌కు చెందిన శైలజా రామయ్యర్‌, ఎన్‌.శ్రీధర్‌, అహ్మద్‌ నదీమ్‌, మీరబ్రహ్మయ్య ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని