పుడమికి తూట్లు...అక్రమార్కులకు రూ.కోట్లు
వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో సుమారు 2 వేల టిప్పర్ల మట్టిని రాత్రికి రాత్రే తరలించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తులపైన,
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
చూసీ చూడనట్లుగా అధికారులు
వికారాబాద్లో ఓ పొలంలో వేసిన మట్టి కుప్పలు
* వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో సుమారు 2 వేల టిప్పర్ల మట్టిని రాత్రికి రాత్రే తరలించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తులపైన, వాహనాలపైన చర్యలు తీసుకోవడానికి మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఓ ప్రజా ప్రతినిధి అండదండలు మెండుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
* వికారాబాద్ మండలం పాతూరు గేటు సమీపంలో వరద కాల్వను పూర్తిగా మూసివేశారు. పక్కన పిల్ల కాలువను తీశారు. లోతట్టు ప్రాంతాలను వందల టిప్పర్ల మట్టితో పూడ్చివేశారు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో వచ్చిపోయే ప్రతి వ్యక్తికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రెవెన్యూ, జలవనరుల శాఖాధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
* దోమ మండలం దిర్సంపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ, అసైన్మెంట్ భూముల్లో మట్టిని తోడి గండి చెరువు కుంటను సగ భాగం మూసివేశారని స్థానికులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.
- ఈనాడు డిజిటల్,వికారాబాద్
‘మట్టే కదా’ అనుకుంటే ‘పొరపడినట్లే.’ అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. సాయంత్రమైతే చాలు జేసీబీలు, పెద్ద సైజు టిప్పర్లు, లారీలు పుడమి తల్లి గుండెలపై నర్తిస్తున్నాయి. కొండలను పిండిచేస్తున్నాయి. ప్రభుత్వ భూములు, కొండవాలు ప్రాంతాలు అనే తేడా లేకుండా అందిన మేరకు తవ్వేస్తున్నాయి.. రాత్రంతా అక్రమార్కులు ఎంపిక చేసుకున్న స్థలానికి మట్టిని తరలిస్తున్నారు. రూ.లక్షల విలువైన మట్టిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారు. వేకువజామున 3 గంటలకు అంతా నిశ్శబ్దం. అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా అధికారులకు తెలియదనుకోవడం అమాయకత్వం. అధికార, అనుకూల పార్టీ నాయకుల అండదండలతో అధికారులు ఏమీ చేయలేరన్న నిర్లక్ష్యంతో యథేచ్ఛగా భూములను తవ్వేస్తున్నారు.
చీలాపూర్లో ట్రాక్టర్లో మట్టిని నింపుతున్న జేసీబీ
ఫిర్యాదు చేసినా పట్టించుకునేది ఎవరు
జిల్లా కేంద్రం వికారాబాద్ అయినా, మారుమూల ప్రాంతమైనా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.30 లక్షలకు తక్కువ పలకడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో వెంచర్లు గ్రామానికి కనీసం రెండు నుంచి ఐదు వరకు ఏర్పాటయ్యాయి. మరో వైపు ఉన్న పొలంలో వ్యవసాయ క్షేత్రం నిర్మించుకోవాలన్నా, అక్కడి వరకు వాహనాలు వెళ్లాలన్నా మట్టిదారులు అవసరం. దీనికోసం గుట్టలన్నీ గుల్ల చేస్తున్నారు.
* వికారాబాద్ పురపాలిక ప్రజలకు తాగునీటి ఆధారమైన శివారెడ్డిపేట్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్)లో మట్టిని నింపుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
* వికారాబాద్ మండలం సిద్దులూరు గ్రామానికి రెండువైపులా వాగులపై వంతెనల నిర్మాణం కోసం మట్టి తరలించేందుకు అనుమతి తీసుకున్నారు. స్థానిక నేతల సాయంతో వంతెన పేరు చెప్పి ప్రైవేటు వెంచర్లకు పెద్దఎత్తున మట్టి తరలిస్తున్నారు.
* పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఓ వెంచరు కోసం సుమారు పది వేల టిప్పర్ల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో తరలించారు. మరోవైపు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వాగును కప్పి, చిన్న కాల్వ తవ్వి విడిచిపెట్టారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు మట్టినట్లు తెలుస్తోంది. ఇదే మండలం చీలాపూర్, పరిగి మండలం లింగంపల్లి, బసిరెడ్డిపల్లి, దోమ మండలం దిర్సంపల్లిల్లో, ఇతర గ్రామాలు, మోమిన్పేట్, ధారూర్, కుల్కచర్ల తాండూరు, ఇతర మండలాల్లో ఈ తరహా మట్టి దందా జోరుగా సాగుతోంది. ఖాళీ గుట్టలనూ వదలక ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన మట్టి పోవడమే కాదు, రూ.వందల కోట్ల విలువైన భూములు సైతం పరాధీనమవుతున్నాయి.
డీల్ చేస్తే అంతా అయిపోయినట్లే
జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా మట్టి దందా జరుగుతోందంటే దాని వెనుక ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, ప్రజా ప్రతినిధుల సహాయ, సహకారాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. కొత్తగా వెంచరు వేయాలనుకునే వ్యక్తులు అధికారుల కంటే ముందు ప్రజా ప్రతినిధులను కలసి, డీల్ మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు ఉన్నా, లేకున్నా పనులు చకచకా జరిగిపోతున్నాయి. అధికారులు సైతం వాటికి అడ్డుచెప్పే ప్రయత్నం చేయడంలేదు. ఈ విషయంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కబ్జా చెరనుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ