logo

మావోయిస్టులనే అనుమానంతో.. పోలీసుల అదుపులో ఇద్దరు?

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను కరీంనగర్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరు నవాబుపేట

Published : 23 Jan 2022 03:09 IST

వికారాబాద్‌, న్యూస్‌టుడే: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులను కరీంనగర్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరు నవాబుపేట మండలం గంగ్యాడకు చెందిన నాగభూషణం, వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లి వాసి గోపాల్‌గా తెలుస్తోంది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన పెయింటర్‌ మల్యాల సురేష్‌ వీరి ప్రమేయంతోనే మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో నిర్వహించిన సమావేశాలకు హాజరైనట్లు తెలిసింది. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్న క్రమంలో వీరిద్దరి వ్యవహారం బహిర్గతం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. స్థానిక పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని