నాడి అందని సర్వే
కరోనా కోరలు చాచిన వేళ వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సాయం అందించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జ్వరం తదితర కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను ఇవ్వాలని
చార్మినార్ జోన్లో వ్యాధి లక్షణాలున్న వారు సున్నాగా నివేదిక!
శేరిలింగంపల్లి జోన్ లెక్కలపైనా విమర్శలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; ఈనాడు, హైదరాబాద్
సర్వేని పరిశీలిస్తున్న రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి
కరోనా కోరలు చాచిన వేళ వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సాయం అందించేందుకు ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జ్వరం తదితర కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే ఔషధ కిట్లను ఇవ్వాలని బల్దియాని ఆదేశించింది. ఓవైపు జీహెచ్ఎంసీలో గరిష్ట స్థాయిలో కేసులు నమోదవుతున్నా, పాతబస్తీ పరిధిలో రెండు రోజుల్లో ఒక్కరూ జ్వరంతో బాధపడటం లేదంటూ లెక్కలు చూపడం సర్వే జరుగుతున్న తీరుకు అద్దం పట్టింది. పలు ఇతర జోన్లలోనూ తూతూమంత్రపు గణాంకాలే చూపుతుండడం విమర్శలకు తావిస్తోంది. చాలా మంది సిబ్బంది ఇళ్లకు వెళ్లకుండానే లెక్కలు రాసేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం కాస్త బాగానే చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల్లో గ్రేటర్లో 2120 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
రాజధానిలో 120 కరోనా పరీక్ష కేంద్రాలు రోజూ వేలాది మంది అనుమానితులతో కిటకిటలాడుతున్నాయి. కిట్లు లేక అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి. మహానగరంలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ జ్వరం సర్వేను చేపట్టింది. గ్రేటర్ 500 మందికిపైగా బల్దియా దోమల నివారణ విభాగం సిబ్బంది, వందలాది మంది డ్వాక్రా మహిళలు, వైద్య సిబ్బంది సర్వేలో నిమగ్నమయ్యారు. ఇంటింటికి తిరిగి వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం, దగ్గర్లోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించి మందుల కిట్లు అందించాలన్నది సర్వే ముఖ్యోద్దేశం. కొన్ని చోట్ల సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వేలో పాల్గొనకుండానే ఎవరికీ లక్షణాలు లేవని నివేదిక ఇస్తున్నారు. గణాంకాల్లో అంకెల గారడీ ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జోనల్ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, వాస్తవాలను నివేదిస్తే కొవిడ్ కట్టడికి తమపై అధిక ఒత్తిడి పెడతారన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. చార్మినార్ జోన్ మొత్తం మీద శుక్ర, శనివారాల్లో చేపట్టిన పరిశీలనలో ఏ ఒక్కరిలోనూ అనుమానిత లక్షణాల్లేవని పేర్కొనడమే అందుకు నిదర్శనం. 15 లక్షల మంది జనాభా ఉండే శేరిలింగంపల్లి జోన్లో కేవలం 20 మందికే కరోనా సూచనలున్నట్లు లెక్కచెప్పారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని కరోనా పరీక్ష కేంద్రాలు కిటకిటలాడుతుండడం గమనార్హం.
60 వేల ఇళ్లు పూర్తి
48 గంటల్లో బల్దియా పరిధిలో 60 వేల ఇళ్లను పరిశీలించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో ఎక్కువ మందికి వ్యాధి లక్షణాలున్నట్లు పేర్కొన్నారు. సర్వేను ఆరు రోజుల్లో ముగించాలని సర్కారు ఆదేశించింది. ఆ లోగా ముగించడం కష్టమని మరిన్ని రోజులు పొడిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 1208 మందిలో..
రంగారెడ్డి జిల్లా వైద్య అధికారులు గణాంకాల ప్రకారం.. రెండు రోజుల్లో 51,338 ఇళ్లలో సర్వే చేశారు. 1208 మంది కరోనా లక్షణాలతో బాధపడుతుండగా వారందరికీ కిట్లను అందజేశారు.
* మేడ్చల్ జిల్లాలో 74,126 ఇళ్లను పరిశీలించగా 4,249 మందిలో లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లను అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?