logo

పగలు ఆటో నడుపుతూ..రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతూ

పగలు ఆటో నడుపుతూ.. రాత్రి వేళ ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మేడిపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొన్నారు. డీఐ మక్బుల్‌ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నడివాడ

Published : 23 Jan 2022 03:09 IST

మహ్మద్‌ ఇమాం, బదావత్‌ గాంధీ, నాగరాజు

మేడిపల్లి (బోడుప్పల్‌), న్యూస్‌టుడే: పగలు ఆటో నడుపుతూ.. రాత్రి వేళ ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మేడిపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొన్నారు. డీఐ మక్బుల్‌ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నడివాడ గ్రామానికి చెందిన మహ్మద్‌ ఇమాం(20), బదావత్‌గాంధీ(20), పరిటాల నాగరాజు(26) స్నేహితులు. కొన్నాళ్లుగా ఉప్పల్‌, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వీరంతా ఆటోలు నడిపేవారు. జల్సాలకు అలవాటుపడి.. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మేడిపల్లి, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌ ప్రాంతాల్లో ముగ్గురిపై 12 కేసులు నమోదయ్యాయి. శనివారం మేడిపల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 80 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి, రూ.20 వేల నగదుతో పాటు ఆటోనూ స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని