బతికున్నా.. చంపేస్తున్నారు..!
మోమిన్పేట్ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు
తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలతో భూముల బదలాయింపు
తరచూ వెలుగులోకి...
పట్టించుకోని అధికారులు
ఈనాడు డిజిటల్, వికారాబాద్
* మోమిన్పేట్ మండలం బూరుగుపల్లిలో బుచ్చమ్మ (పక్క చిత్రం) అనే మహిళ బతికి ఉండగానే మృతి చెందిదంటూ తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. అది నిజమే అంటూ తహసీల్దారూ ఆమోదించారు. అనంతరం వంశ వృక్షం వేసి ఆ భూమి వారసురాలు ఈమే అంటూ ఓ మహిళ పేరిట పేర్లు మార్పించారు (మ్యుటేషన్). దాన్ని వారం తిరగకముందే వేరొరికి అమ్ముకున్నారు. అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ భూమి విలువ అక్షరాలా రూ.8 కోట్లపైమాటే అని అంచనా. సర్వే నంబరు 46, 49లలో 3 ఎకరాల భూమికి 2005 నుంచి 2014 వరకు నాలుగు దఫాలు రిజిస్ట్రేషన్ జరిగింది. కొంత కాలంగా మ్యుటేషన్ పెండింగ్లో ఉంది. సంబంధిత వ్యక్తులు తరచూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. అయితే ఇటీవల భూమికి సంబంధించి వారసులమంటూ ఓ మహిళ రావడం, గతంలో రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసి, బతికి ఉన్న వ్యక్తిని మృతి చెందినట్లు చూపించి, మా భూమిని అక్రమంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
* ధారూర్ మండలంలోనూ రెండు నెలల క్రితం ఇదే తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్కు చెందిన మహిళకు ధారూర్ మండలంలో వ్యవసాయ పొలం ఉంది. ఆమె ‘మృతి చెందింది’ అంటూ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ ఉద్యోగి తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. తీరా విషయం బయటకు రావడంతో కొన్నాళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అనంతరం ముందస్తు బెయిల్ తీసుకుని దర్జాగా తిరుగుతున్నాడు. ఈయన విషయంలో కొంత మంది ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారని సమాచారం.
సజీవంగా ఉన్నా.. వారు ‘చనిపోయారంటూ’ తప్పుడు మరణ ‘ధ్రువీకరణ’ పత్రాలను సృష్టించడం.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాం.. అది వాస్తవమే అంటూ నిర్ధరించం రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారిపోతోంది. అనంతరం సదరు వ్యక్తులకు చెందాల్సిన భూముల మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, పేరు మార్పిడి అయిన వెంటనే రూ.కోట్ల విలువైన భూములను అమ్ముకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వ్యవహారంలో అక్రమంగా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే తప్పు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఉన్నతాధికారులు ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో జిల్లాలో మళ్లీమళ్లీ అదే తరహా సంఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది.
లోపాలే ఆసరా... అంతా కుమ్మక్కు
జిల్లా కేంద్రమైన వికారాబాద్, మోమిన్పేట్, పూడూరు, పరిగి, నవాబుపేట్ మండలాల్లో భూములకు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా ఎకరం కనీసం రూ.53 లక్షల నుంచి రూ.1.30 కోట్లు పలుకుతోంది. దీంతో రెవెన్యూ శాఖలో పనిచేసే కొంత మంది ఉన్నత, మధ్యస్థాయి సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి లోపాలను ఆసరాగా చేసుకుని పావులు కదుపుతున్నారు. తగాదాల్లో ఉన్నవి, కొన్నాళ్లుగా ఎవరూ పట్టించుకోని భూములను లక్ష్యంగా చేసుకుని, నకిలీ సంతకాలతో కొత్త ధ్రువ పత్రాలు సృష్టిస్తున్నారు. ధరణి పోర్టల్లో అంతా సరి చేస్తున్నారు. ఆనక అమ్మకానికి పెడుతున్నారు.
* వికారాబాద్ మండలం బూర్గుపల్లిలో రూ.5 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేసి, ఇతర ఉన్నతాధికారులు తప్పించుకున్నారు. ఇదే మండలంలో ఈ తరహా సంఘటనలో మరో మూడు వెలుగులోకి వచ్చాయి.
* పరిగి మండలంలో ప్రభుత్వం సాదాబైనామాలను నిలిపివేసిన తరువాత తహసీల్దార్ ఆన్లైన్ చేసి, వేరే వ్యక్తులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేశారు. ఈ సందర్భంలోనూ ఉన్నతాధికారులు గుట్టుగానే వ్యవహరించారనే విమర్శలొచ్చాయి. చర్యల శూన్యం.
* పూడూరు మండలంలో 14 ఎకరాల దేవాదాయ భూములను ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు, ఫోర్జరీ సంతకాలు చేసిన వ్యక్తులు దర్జాగా తిరుగుతున్నారు. మరెన్నో సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ విషయమై రెవెన్యూ విభాగంలోని ఓ ఉన్నతాధికారిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పాలనాధికారి సైతం భూముల పేర్ల బదలాయింపులో జరుగుతున్న అక్రమాలపై పూర్తి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే