‘దళిత బంధు’కు కసరత్తు ప్రారంభం
జిల్లాలో ‘దళిత బంధు’కు అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం పేర్కొనడంతో పథకం అమలుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, మార్చి నెలలో
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ: జిల్లాలో ‘దళిత బంధు’కు అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం పేర్కొనడంతో పథకం అమలుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని, మార్చి నెలలో నిర్దేశిత ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని శనివారం రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సబితారెడ్డి అధికారులకు సూచించారు. దీంతో పథకం నిర్వహణకు ప్రతి నియోజక వర్గానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా నియోజక వర్గ ఎమ్మెల్యేలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు.
400 మందిని ఎంపిక చేస్తారు
నియోజక వర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేయాలనేది నిబంధన. దీనికి అనుగుణంగా జిల్లాలోని కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజక వర్గాల్లో 400 మంది లబ్ధిదారులను గుర్తించనున్నారు. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజక వర్గంలో గతేడాది ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల్లో అమలు చేస్తున్నారు. దీన్లో భాగంగా ప్రస్తుతం జిల్లాలో కసరత్తు మొదలైంది.
నేరుగా రూ.10 లక్షలు జమ
ఈ పథకం కింద దళితులకు బ్యాంక్లతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ రూపంలో అందజేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 54,358 దళిత కుటుంబాలు ఉన్నట్లు కుటుంబ సర్వే ద్వారా తేలింది. ఇచ్చిన మొత్తంతో మినీ డెయిరీ యూనిట్, పందిరి కూరగాయల సాగు, వ్యవసాయం కోసం యంత్ర పరికరాల కొనుగోలు, ట్రాక్టర్ ట్రాలీ, ఆటో ట్రాలీ కొనుగోలు వంటివి చేయవచ్చు. అలాగే కోడి పిల్లల పెంపకం, సెవన్ సీటర్ ఆటో, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణం, టెంట్ హౌజ్, డెకరేషన్ లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఆటో ట్రాలీ, ఆయిల్ మిల్లు, నాలుగు చక్రాల వాహనం, మినీ సూపర్బజార్, డీటీపీ, మీ సేవ, ఆన్లైన్ సేవలు ఫొటో స్టూడియో, బిల్డింగ్ సామగ్రి, హార్డ్వేర్ దుకాణం పెట్టుకోవచ్చు. ఒక్కరే కాకుండా ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు కలిసి రూ.30, 40 లక్షలతో పెద్ద వ్యాపారం కూడా చేసుకునే అవకాశాం కల్పించారు.
ఇలా చేస్తారు: లబ్ధిదారుల ఎంపిక అనంతరం కలెక్టర్ ప్రతి మండలంలో అనువైన బ్యాంక్ను ఎంపిక చేసి కుటుంబ పెద్ద పేరిట ప్రత్యేకంగా దళిత బంధు ఖాతాను తెరిపిస్తారు. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ను సంప్రదించి ఆమోదం తీసుకున్న తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. నిధులు ఒకేసారి కాకుండా ప్రాజెక్టు నిర్వహిస్తున్న కొద్దీ విడుదలవుతాయి. లబ్ధిదారులను బృందాలుగా మారుస్తారు. ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి నియోజక వర్గంలో ఒక అధికారి దళిత బంధు పథకాన్ని పర్యవేక్షిస్తారని మంత్రులు పేర్కొన్నారు. పథకం పటిష్ఠంగా అమలై జీవితాలకు ఆర్థికంగా అండగా నిలవాలని దళితులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్