logo

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత నిర్మల్‌ జిల్లా బాసర వద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి స్నానఘట్టాల వద్ద నదిలో ఓ మహిళ మృతదేహం తేలియాడుతోందన్న

Published : 24 Jan 2022 01:42 IST

బాసర, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత నిర్మల్‌ జిల్లా బాసర వద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరి స్నానఘట్టాల వద్ద నదిలో ఓ మహిళ మృతదేహం తేలియాడుతోందన్న స్థానికుల సమాచారం మేరకు బాసర పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. ఆధారాల కోసం పరిశీలించగా మహిళ చేతిపై మొబైల్‌ నంబరు కనిపించింది. ఆ నంబరుకు పోలీసులు ఫోన్‌ చేయగా ఆమె భర్త మాట్లాడారు. మృతురాలి పేరు సుస్మిత అని, నివాసం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ అని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విషయం భర్తకు తెలియజేసిన పోలీసులు శవపంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాసర ఎస్సై మహేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని