ఎరుపెక్కిన తుర్కయాంజాల్.. ఏకమైన సీపీఎం శ్రేణులు
సీపీఎం తృతీయ రాష్ట్ర మహాసభలు ఆదివారం నగర శివారులోని తుర్కయాంజాల్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు(ఈ నెల 22న) ఆన్లైన్లో సభను ప్రారంభించగా.. రెండోరోజు తుర్కయాంజాల్లోని
అట్టహాసంగా పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
సీపీఎం జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు
తుర్కయాంజాల్, న్యూస్టుడే: సీపీఎం తృతీయ రాష్ట్ర మహాసభలు ఆదివారం నగర శివారులోని తుర్కయాంజాల్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు(ఈ నెల 22న) ఆన్లైన్లో సభను ప్రారంభించగా.. రెండోరోజు తుర్కయాంజాల్లోని ఎస్ఎస్ఆర్ కల్యాణమండపంలో అమరవీరుల స్తూపం వద్ద ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జెండావిష్కరణ చేసి సభను ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు తరలివచ్చారు. కొవిడ్ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తూ ప్రతినిధులను లోపలికి అనుమతించారు. రాష్ట్ర మహాసభల నేపథ్యంలో నాగార్జునసాగర్ రేడియల్ రహదారి(ఎగ్జిట్ 12), అటు బీఎన్రెడ్డినగర్ నుంచి బొంగుళూరు జంక్షన్ వరకు ఎర్రటి తోరణాలతో అలంకరించారు. సభకు హాజరయ్యే ప్రతినిధుల విడిది కోసం తుర్కయాంజాల్ పట్టణంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జాతీయ ప్రతినిధుల బసకు వీలుగా స్థానిక తులిప్స్ గ్రాండ్ హోటల్లో ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణంలో నవతెలంగాణ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ప్రవేశ ద్వారం వద్ద.. ప్రజాఉద్యమంలో అసువులుబాసిన కమ్యూనిస్టు చరిత్రకారుల సందేశాలతో కూడిన చిత్రపటాలను ఆకర్షణీయంగా ఏర్పాటుచేశారు. ఆ పార్టీ గాయకుడు నర్సింహ పాడిన గీతాలు శ్రేణులను ఉత్తేజపరిచాయి. కళాబృందాల ఆటపాటలూ ఆకట్టుకున్నాయి. సీపీఎం మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజా బొజ్జి, మస్కు నర్సింహ మృతికి సంతాపంగా సభలో మౌనం పాటించి వారి సేవలను స్మరించుకున్నారు. సీనియర్ నేత చెరుపల్లి సీతారాములు అధ్యక్షత వహించగా, అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాజకీయ తీర్మానం, నాయకురాలు హైమవతి సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా