ఆంక్షల వలయంలోకి కమ్యూనిటీలు
కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు విధిస్తున్నారు. శానిటైజేషన్పై అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకు నెలకు ప్రత్యేకంగా కొంత
కరోనా తీవ్రతతో గేటెడ్, అపార్టుమెంట్లలో అప్రమత్తం
ఆటస్థలాలు, ఈతకొలనుల మూసివేత
బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సాయం
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే, మియాపూర్, కేపీహెచ్బీకాలనీ
మైహోం జ్యువెల్లో క్రిమి సంహారక మందు పిచికారి
కరోనా కేసుల పెరుగుదల.. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలో ప్రజలు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు విధిస్తున్నారు. శానిటైజేషన్పై అధిక శ్రద్ధ పెడుతున్నారు. ఇందుకు నెలకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. కొన్ని నెలలుగా కరోనా కేసులు లేకపోవడంతో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేకంగా నిబంధనలు అమలు చేయలేదు. ఇటీవల కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతుండడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నివాసిత సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. వీలైనంత వరకు సమూహాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టాయి. పిల్లల ఆటస్థలాలు, టెన్సిస్ కోర్టులు, క్లబ్ హౌస్లు, వాణిజ్య కార్యకలాపాలను అనుమతించడం లేదని పేర్కొంటున్నాయి. ‘‘జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. లిఫ్టులను శానిటైజ్ చేయిస్తున్నాం. సీ బ్లాక్లో కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి.’’ అని మూసాపేటలోని రెయిన్బో విస్టాస్ నివాసితుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఆకెళ్ల శ్రీరామ్ వివరించారు.
ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు
కరోనా కేసులు వచ్చిన కుటుంబాలుండే ఫ్లాట్లకు ప్రత్యేకంగా స్టిక్కర్లు అతికిస్తూ.. బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడు రోజులపాటు ఐసోలేషన్లో ఉండేందుకు సూచిస్తున్నారు. ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు అవసరమైన సరకులు సరఫరా చేస్తున్నారు. కేపీహెచ్బీలోని మలేషియన్ టౌన్షిప్లో ఆటస్థలాలను తాత్కాలికంగా మూసివేశారు. నివాసితులు బయట సంచరించే సమయంలో మాస్కు తప్పనిసరిగా పెట్టుకునేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పర్యవేక్షకులను ఏర్పాటు చేసినట్లు టౌన్షిప్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేశ్ వివరించారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సిద్ధం
మదీనాగూడలోని మైహోం జ్యువెల్ కమ్యూనిటీలో 2 వేల ఫ్లాట్లు ఉన్నాయి. సంక్షేమ సంఘం నాయకులు అప్రమత్తమై 24 గంటలు అందుబాటులో ఉండేలా ‘కొవిడ్ రెస్పాన్స్ టీం’ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సదరు బృందం సాయంతో బాధితులకు సరకులు, మందులు చేరవేస్తున్నారు. కమ్యూనిటీలో ప్రత్యేకంగా అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేశారు. ఈతకొలనును మూసివేశారు. స్టాళ్ల నిర్వహణ విషయంలో ఆహారం, వస్త్ర సంబంధిత దుకాణాలపై నిబంధనలు విధించి అత్యవసర వస్తువులకే అనుమతిస్తున్నారు.
ప్రతి వీధిలో అవగాహన కల్పిస్తున్నాం
- నందకిశోర్, ప్రధాన కార్యదర్శి, మైహోం జ్యువెల్ యజమానులు సంక్షేమ సంఘం
మా కమ్యూనిటీలోని 14 బ్లాకుల్లో 2 వేల ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడక్కడా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రతి వీధి తిరుగుతూ మైకుతో అవగాహన కల్పిస్తున్నాం. కమ్యూనిటీలో ఏటా డిసెంబరు 31న రాత్రి భారీ ఎత్తున నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తుంటాం. ఈసారి వేడుకలను రద్దు చేసి సమూహాలను అనుమతించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)