logo

టైరు ఎగిరిపడి కూలీ మృతి

లారీపై నుంచి స్టెప్నీటైరు ద్విచక్ర వాహనంపై పడి కూలీ పనిచేసుకునే ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పరిగి మండల పరిధిలోని రాఘవాపూర్‌ గ్రామ....

Published : 25 Jan 2022 02:07 IST

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: లారీపై నుంచి స్టెప్నీటైరు ద్విచక్ర వాహనంపై పడి కూలీ పనిచేసుకునే ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పరిగి మండల పరిధిలోని రాఘవాపూర్‌ గ్రామ పరిసరాల్లో పరిగి- షాద్‌నగర్‌ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలానికి చెందిన నిఖిల్‌రెడ్డి (21) పరిగినుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా (బోరుబావులను తవ్వే పరికరాలను, పైపులను తరలించే) లారీ అతివేగంగా వస్తుండగా..కల్వర్టు దగ్గర అందులో ఉన్న టైరు పైకి ఎగిరి నిఖిల్‌రెడ్డిపై పడటంతో తల పగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. టైరు వేగంగా పక్కనున్న వంతెనకు ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లిందని, ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నట్లు మరో వాహనదారుడు వివరించాడు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణాలు బలి తీసుకున్న డ్రైవర్‌ లారీతోపాటు పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని