logo

భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్యతోపాటు ఆమెకు సహకరించిన ప్రియుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 3 వేల జరిమానా విధించింది మేడ్చల్‌ న్యాయస్థానం.

Published : 25 Jan 2022 02:07 IST

నిందితురాలి సహా ప్రియుడికి జీవిత ఖైదు


లక్ష్మి, బాల్‌రాజ్‌

మేడ్చల్‌,న్యూస్‌టుడే: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్యతోపాటు ఆమెకు సహకరించిన ప్రియుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 3 వేల జరిమానా విధించింది మేడ్చల్‌ న్యాయస్థానం. మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మండలం అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36) ఆటో డ్రైవర్‌. గ్రామానికి చెందిన గుంటి బాల్‌రాజ్‌ అతని భార్య మహంకాళి లక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరూ 2020 ఏప్రిల్‌ 9న కృష్ణకు కల్లులో మత్తు గుళికలు కలిపి తాగించి హత్య చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన 11వ అదనపు న్యాయమూర్తి కె.జయంతి పై విధంగా తీర్పు చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని