logo

గొంతు కోసుకుని క్యాన్సర్‌ రోగి బలవన్మరణం

ఓ క్యాన్సర్‌ రోగి మానసిక ఆందోళనతో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవానీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం..

Published : 25 Jan 2022 02:07 IST


అజహరుద్దీన్‌

చార్మినార్‌, న్యూస్‌టుడే: ఓ క్యాన్సర్‌ రోగి మానసిక ఆందోళనతో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవానీనగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన అజహరుద్దీన్‌(34) ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల ఉద్యోగం వదులుకుని ఇంటివద్దనే ఉంటున్నాడు. గర్భిణి అయిన అతడి భార్య పర్హానాబేగం(26) రెండేళ్ల కుమార్తెను తీసుకుని కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇటీవల ఆడశిశువుకు జన్మనిచ్చింది. కొద్దిరోజులు అత్తింట్లోనే ఉన్న అజహరుద్దీన్‌ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి వచ్చాడు. మానసిక ఆందోళనతో కత్తితో గొంతు కోసుకోగా రక్తస్రావమై మృతిచెందాడు. భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అమ్జాద్‌అలీ కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని