logo

కొత్త బైక్‌ కొని నెల రోజులే..

ఆ యువకుడు ఇటీవల కొత్త ద్విచక్ర వాహనం కొన్నాడు... దానిపై వెళ్లి తనకిష్టమైన క్రికెట్‌ పోటీలను చూశాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.

Published : 25 Jan 2022 02:31 IST

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

 

కోట్‌పల్లి: ఆ యువకుడు ఇటీవల కొత్త ద్విచక్ర వాహనం కొన్నాడు... దానిపై వెళ్లి తనకిష్టమైన క్రికెట్‌ పోటీలను చూశాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన అతడి కుటుంబసభ్యులతోపాటు గ్రామస్థులనూ కంటతడి పెట్టించింది. కోట్‌పల్లి పోలీస్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ప్రమాద వివరాలు ఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం.. బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన కుర్వ ఎల్లప్ప(21) నెల రోజుల క్రితం పల్సర్‌ వాహనాన్ని కొనుగోలు చేశాడు. సోమవారం వాహన రిజిస్ట్రేషన్‌ కోసం తండ్రి మహిపాల్‌తో కలిసి వికారాబాద్‌ వచ్చారు. ఆ పనులు ముగించుకొని ఇద్దరూ కోట్‌పల్లి వెళ్లారు. తండ్రిని గ్రామానికి చెందిన మరోవ్యక్తి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్లమని చెప్పాడు. తాను రాంపూర్‌ వద్ద జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ చూడడానికి వెళ్లాడు. పోటీలు ముగిసిన తర్వాత బైక్‌పై ఇంటికి వెళుతుండగా అన్నసాగర్‌ గ్రామ సమీపాన మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని